News March 5, 2025

పత్రాల జారీలో జాప్యాన్ని నివారించండి: నంద్యాల కలెక్టర్

image

జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం లేకుండా నిర్ణీత కాల వ్యవధిలోగా అందజేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి వైద్యాధికారులు, మున్సిపల్ కమీషనర్లు, పంచాయతీ అధికారులను ఆదేశించారు. మంగళవారం నంద్యాల కలెక్టర్ ఛాంబర్‌లో జనన మరణ పత్రాల జారీపై ఇంటర్ డిపార్ట్‌మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు.

Similar News

News March 6, 2026

జిల్లాలో 305 మంది ఇంటర్ విద్యార్థుల గైర్హాజరు

image

కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఐఈఓ ఆఫీస్ నుంచి వివిధ కళాశాలల్లో జరుగుతున్న పరీక్షలను సీసీ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఆయన పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా 42 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 7265 మంది విద్యార్థులకు గానూ 6960 మంది హాజరు కాగా, 305 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.

News March 6, 2026

కదిరిలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళల అరెస్ట్

image

కదిరి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివ నారాయణస్వామి శుక్రవారం తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరాన్ని ఒప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.5,65,000 విలువ చేసే నగలు, రూ.75,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 6, 2026

సీజనల్ వ్యాధులపై కలెక్టర్ సమీక్ష

image

కర్నూలు కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ డా.ఏ.సిరి నిర్వహించారు. విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల్లో నీటి నమూనాలను 15 రోజులకు ఒకసారి సేకరించి పరీక్షించాలని ఆమె ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. పరిశుభ్రమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.