News January 30, 2025

పథకాలు ఎప్పుడిస్తారు..?: DC గోవిందరెడ్డి

image

ఎన్నికల సమయంలో సూపర్-6 అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు, కూటమి నాయకులు నేడు మేనిఫెస్టో అమలుపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మండిపడ్డారు. నీతి ఆయోగ్ నివేదికపై మాట్లాడుతూ.. ‘‘సంక్షేమ పథకాల అమలుకు ఇంకా సంపద సృష్టించాల్సి ఉందని సీఎం అంటున్నారు. 15% పెరిగితే తప్ప పథకాలు అమలు చేయలేమన్నారు. ఆ 15 శాతం సంపద ఎప్పుడు పెరుగుతుందో ప్రజలకు చెప్పాలి’ అని ఆయన కోరారు.

Similar News

News November 27, 2025

ఒంటిమిట్ట మండలంలో కుంగిన వంతెన

image

ఒంటిమిట్ట మండల పరిధిలోని చెర్లోపల్లి గ్రామానికి వెళ్లేందుకు వంకపై వేసిన వంతెన కుంగిపోయింది. ఈ నెలలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ఒంటిమిట్ట మండలంలో వంకలు పొంగి పొర్లాయి. చెర్లోపల్లి వంకలో అధిక నీటి ప్రవాహం ప్రవహించడంతో వంతెనకు ఇరువైపులా ఉన్న మట్టి నాని పోయింది. ఈ క్రమంలో ఆ వంతనపై అధిక బరువు ఉన్న ఇసుక టిప్పర్ వెళ్లడంతో ఆ బరువుకు వంతెన కుంగినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

News November 27, 2025

కరెంట్ షాక్‌తో కడప జిల్లా యువకుడి మృతి

image

పులివెందులలోని వాసవీ కాలనీలో బుధవారం రాత్రి యువకుడు చైతన్య విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. యువకుడు ఇంటిలో పిండి గ్రైండింగ్ ఆడిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోవడంతో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

News November 27, 2025

పులివెందులలో జగన్.. విద్యార్థులతో సెల్ఫీ

image

కడప జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం జగన్ ఇవాళ తన సొంత నియోజకవర్గంలో రైతులను పరామర్శించడానికి వెళ్లిన విషయం తెలిసిందే. జగన్‌ దారి మధ్యలో వెళ్తూ ప్రజలతో మమేకమై మాట్లాడుకుంటూ వెళ్లారు. అందులో ఆయనను కలవడానికి స్థానికంగా పిల్లలు వచ్చారు. వారితో ఆయన ఆప్యాయంగా మాట్లాడుతూ.. సెల్పీ తీసుకున్నారు. బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు.