News August 5, 2024
పథకాలు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు: తమ్మినేని

రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలన పోయి, రెడ్ బుక్ పాలన ఆవిష్కృతమైందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సంక్షేమంలో పరుగులు తీస్తున్న రాష్ట్రాన్ని ఒక్కసారిగా సంక్షోభంలోకి నెట్టేశారని మండిపడ్డారు. పథకాలు పూర్తిస్థాయిలో అందక ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా నేతలను వేధింపులకు గురి చేయడం తగదన్నారు.
Similar News
News December 10, 2025
సిక్కోలు నేతల మౌనమేలనో..?

ఇండిగో సంక్షోభంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఇండిగో సంక్షోభానికి రామ్మోహన్ నాయుడే కారణమని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ తదితరులు కేంద్ర మంత్రిపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లాలో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు పెద్దగా స్పందించకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతుంది.
News December 10, 2025
ఇండిగో సంక్షోభంపై సిక్కోలు నేతలు మౌనం

ఇండిగో సంక్షోభంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును వైసీపీ టార్గెట్ చేస్తుంది. ఇండిగో సంక్షోభానికి రామ్మోహన్ నాయుడే కారణమని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్ తదితరులు కేంద్ర మంత్రిపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లాలో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు పెద్దగా స్పందించకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతుంది.
News December 10, 2025
శ్రీకాకుళం మహిళ దారుణ హత్య

పెందుర్తిలోని సుజాతనగర్లో మహిళను కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రీకాకుళానికి చెందిన దేవి, శ్రీనివాస్ సుజాతనగర్లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు మధ్య శనివారం రాత్రి వివాదం చోటుచేసుకోగా ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవల శ్రీనివాస్ రైస్ పుల్లింగ్ కేసులో అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు.


