News August 5, 2024

పథకాలు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు: తమ్మినేని

image

రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలన పోయి, రెడ్ బుక్ పాలన ఆవిష్కృతమైందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సంక్షేమంలో పరుగులు తీస్తున్న రాష్ట్రాన్ని ఒక్కసారిగా సంక్షోభంలోకి నెట్టేశారని మండిపడ్డారు. పథకాలు పూర్తిస్థాయిలో అందక ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా నేతలను వేధింపులకు గురి చేయడం తగదన్నారు.

Similar News

News December 4, 2025

గర్భస్థ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం: DM&HO

image

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని DM &HO అనిత స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం లింగ ఆధారిత హింస నివారణ, మెడికో లీగల్ కేర్‌పై శిక్షణ కార్యక్రమం జరిగింది. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న హింసలను అరికట్టి, లింగ వివక్ష చూపరాదని డీఎంహెచ్వో తెలియజేశారు.

News December 3, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤కోటబొమ్మాళిలో జేసీ ఆకస్మిక తనిఖీ
➤పాతపట్నం: లగేజీ ఆటో బోల్తా.. బాలుడికి గాయాలు
➤మనుషుల నుండి Scrub Typhus వ్యాపించదు: DMHO
➤శ్రీకాకుళం: ప్రజా ఉద్యమంపై ఉక్కుపాదం వద్దు
➤రైతుసేవలో కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే బగ్గు
➤మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే శిరీష
➤మందస: నరకాన్ని తలపిస్తున్న రహదారులు

News December 3, 2025

శ్రీకాకుళం: ‘స్ర్కబ్ టైఫస్ వ్యాధి..పరిశుభ్రతతో దూరం

image

‘స్ర్కబ్ టైఫస్’ వ్యాధి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం(D) కొత్తూరు, గార, హిరమండలంలో 10 రోజుల క్రితం కొంతమంది దీని బారిన పడ్డారు. ఎన్ని కేసులు నమోదయ్యాయో అధికార ప్రకటన రావాల్సి ఉంది. అపరిశుభ్ర ప్రాంతాల్లో నల్లిని పోలిన చిన్న పురుగు పెరుగుతోంది. ఇది కుట్టడంతో ఈ వ్యాధి వ్యాపిస్తోందని, తీవ్ర జ్వరం, అలసట, జలుబు ఉంటే తక్షణం చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పరిశుభ్రత పాటించాలన్నారు.