News January 27, 2025
పథకాల పంపిణీపై ఉద్యోగుల సేవలు భేష్: BPL కలెక్టర్

భూపాలపల్లి జిల్లాలో నాలుగు పథకాల జారీ ప్రక్రియలో భాగస్వాములైన గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారుల అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం అన్ని శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.
Similar News
News December 4, 2025
తిరుపతి: 11 ఏళ్ల అంధ మారథాన్ అరుదైన ప్రపంచ రికార్డుకు అడుగులు

ప్రపంచ రికార్డు సాధన దిశగా 11 ఏళ్ల అంధ బాలుడు మురారి హర్షవర్ధన్ ముందడుగు వేశాడు. హర్షవర్ధన్ నాన్-స్టాప్ 200 km బ్లైండ్ మల్టీ-టాస్క్ రోడ్డు స్కేటింగ్ మారథాన్ను ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి చేయనున్నారు. ఈ అరుదైన సాహసానికి AP శాప్ ఛైర్మన్ రవినాయుడు అండగా నిలిచారు. మారథాన్కు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయంతో పాటు, అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించాలని చిత్తూరు, తిరుపతి క్రీడా అధికారులను ఆదేశించారు.
News December 4, 2025
బాలాజీ రైల్వే డివిజన్ కోసం వినతి

తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని సాధన సమితి నాయకులు కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ను న్యూఢిల్లీలో కలిశారు. మంత్రి రామ్మోహన్ నాయుడు, లావు కృష్ణదేవరాయలు, ఎంపీ దుర్గాప్రసాద్తో కలిసి సమితి వినతిపత్రం సమర్పించారు. రాయలసీమ అభివృద్ధికి డివిజన్ అవసరమని తెలిపారు. రేణిగుంట, తిరుచానూరు స్టేషన్ల అభివృద్ధితో పాటు సింహపురి ఎక్స్ప్రెస్ను రేణిగుంట వరకు పొడిగించాలని కోరారు.
News December 4, 2025
బాత్రూమ్లో ఎంతసేపు ఉంటున్నారు?

డీహైడ్రేషన్, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఫైబర్ కొరత వల్ల మలబద్ధకం ఏర్పడుతుందని అందరూ అనుకుంటారు. టాయిలెట్ను ఆపుకోవడం, బాత్రూమ్లో ఎక్కువసేపు గడపడమూ మలబద్ధకానికి కారణమేనంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు. ‘పెద్దపేగు, పురీషనాళం అనుసరించే లయను విస్మరిస్తే మలం గట్టిగా మారుతుంది. ఫోన్ చూస్తూ 10 ని.ల కంటే ఎక్కువసేపు బాత్రూమ్లో కూర్చోవడం వల్ల మల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది’ అని పేర్కొంటున్నారు.


