News March 28, 2025

పదవి కాలం ముగిసిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కూర రఘోత్తమ రెడ్డికి సన్మానం

image

శాసనమండలిలో పదవి కాలం పూర్తి చేసుకున్న ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కూర రఘోత్తమ రెడ్డిని గురువారం రాత్రి ఘనంగా సత్కరించారు. కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానం నుంచి గతంలో కూర రఘోత్తమ రెడ్డి గెలుపొందారు. ఈనెల 29న పదవీకాలం ముగుస్తుండడంతో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూర రఘోత్తమ రెడ్డిని ఘనంగా సత్కరించారు.

Similar News

News December 17, 2025

పైలట్ శిక్షణను వేగవంతం చేయనున్న ఇండిగో

image

ఇండిగో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ ట్రైనింగ్, కెప్టెన్‌ అప్‌గ్రేడ్లను వేగవంతం చేయాలని నిర్ణయించింది. గతంలో నెలకు 35-40 మందిని కెప్టెన్లుగా ప్రమోట్‌ చేసిన సంస్థ, ఈ ఏడాది 10-12 మందికే పరిమితమైంది. ఇక జనవరి నుంచి మళ్లీ పూర్తి స్థాయిలో అప్‌గ్రేడ్లు ప్రారంభించనుంది. అయితే కొత్త కెప్టెన్లు 18-24 నెలల పాటు వేరే బేస్‌లో పనిచేయాలి. మధ్యలో వెళ్లిపోతే రూ.20-30 లక్షల వరకూ చెల్లించాల్సి ఉంటుంది.

News December 17, 2025

లింగసముద్రం: గుండెపోటుతో హోంగార్డు మృతి

image

లింగసముద్రం పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న కొండలరావు గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం రాత్రి బైక్‌పై విధి నిర్వహణకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

News December 17, 2025

కృష్ణా: గొబ్బెమ్మల పూజలతో గ్రామాల్లో సంక్రాంతి సందడి షురూ

image

ధనుర్మాసం ప్రారంభమవడంతో గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం మొదలైంది. మహిళలు మంచును సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామునే ఆవు పేడతో సంప్రదాయ గొబ్బెమ్మలు తయారు చేసి, గృహాల ముందు ఏర్పాటు చేస్తున్నారు. రంగురంగుల ముగ్గులు, పూల అలంకరణలతో గొబ్బెమ్మలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుండడంతో గ్రామాలు కళకళలాడుతున్నాయి.