News March 20, 2025

పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ ప్రతీక్

image

పదవ తరగతి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి డీఈవో రేణుక దేవితో కలిసి కలెక్టర్ పరీక్షల నిర్వహణ అధికారులతో తహసీల్దారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. ఎలాంటి మాస్ కాఫింగు అవకాశం లేకుండా చూడాలన్నారు.

Similar News

News December 10, 2025

పారిశ్రామిక పార్కుల్లో APదే అగ్రస్థానం

image

AP: దేశవ్యాప్తంగా ఉన్న 4,597 పారిశ్రామిక పార్కుల్లో అత్యధికంగా 638 ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల సహాయమంత్రి జితిన్ ప్రసాద లోక్‌సభలో వెల్లడించారు. MPలు పుట్టా మహేశ్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మహారాష్ట్ర 527 పార్కులతో రెండో స్థానంలో, రాజస్థాన్ 460తో మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో 169 పారిశ్రామిక పార్కులు ఉన్నాయన్నారు.

News December 10, 2025

పురుగు మందులు.. రైతులకు సూచనలు

image

ఒకే మందు పొడి మందుగా, నీటిలో కరిగే ద్రావణంగా, గుళికల రూపంలో లభ్యమౌతుంటే.. ఆశించిన తెగులు, పంట దశ, నీటి లభ్యత, సమస్య తీవ్రతను బట్టి ఎంచుకోవాలి. పొడి మందులు గాలికి ఎగిరిపోయి వాతావరణ కాలుష్యం కలిగించవచ్చు. నీటిలో కరిగే పొడిమందులను సరిగా కలపకపోతే స్ప్రేయర్‌ల నాజిల్స్‌లో చేరి సరిగా పనిచేయవు. నాసిరకం మందులు కలుపుతున్నప్పుడు చర్మం నుంచి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే వీటిని జాగ్రత్తగా వాడాలి.

News December 10, 2025

అలా చేస్తే కేసులు నమోదు చేస్తాం: తిరుపతి SP

image

తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఇప్పిస్తామని జీప్ డ్రైవర్లు, దళారులు భక్తులను మోసగిస్తే కేసులు నమోదు చేస్తామని తిరుపతి SP సుబ్బరాయుడు హెచ్చరించారు. వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాట్లపై TTD అధికారులతో ఆయన సమీక్ష చేశారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, శ్రీనివాసం, అలిపిరి, లగేజ్ కౌంటర్ వంటి ముఖ్య ప్రదేశాల్లో భక్తులకు నిరంతర అవగాహన కల్పించాలని సూచించారు. రెగ్యులర్‌గా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ఉంటాయన్నారు.