News February 19, 2025
పదవ తరగతి పరీక్షలకు 26497 విద్యార్థులు: కలెక్టర్

పల్నాడులో 2025 పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు 26,497 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు తెలిపారు. విద్యాశాఖ అధికారులతో మంగళవారం 128 కేంద్రాలలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలన్నారు. విద్యాశాఖ అధికారులు తహశీల్దార్లతో సమన్వయం చేసుకొని విధుల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా ఉండాలన్నారు. డీఈవో చంద్రకళ, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 14, 2025
పిఠాపురం ఆలయాల అభివృద్ధికి రూ.19 కోట్లు..!

ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దాలని Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ‘నియోజకవర్గంలోని 20ఆలయాల అభివృద్ధికి రూ.19 కోట్లు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కోరాం. కామన్ గుడ్ ఫండ్ కింద ఇవ్వడానికి మంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. పురుహూతిక అమ్మవారు, శ్రీకుక్కుటేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి రూ.6 కోట్లు కేటాయిస్తాం’ అని ఆలయాలపై జరిగిన సమీక్షలో పవన్ చెప్పారు.
News November 14, 2025
TU: ‘వివాదాస్పద నియామకాలను రద్దు చేయాలి’

టీయూలో 2012 నియామకాలను రద్దు చేయాలని ఇటీవల హై కోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీ ఉన్నతాధికారులు సంబంధిత నియామకాల విషయంలో కోర్టు ఆదేశాలను పాటించకపోవడం పట్ల పిటిషన్ దారుడు వెంకట్ నాయక్ శుక్రవారం రిజిస్ట్రార్ యాదగిరిని కలిసి నియామకాలను రద్దు చేయాలని కోరారు. కోర్టు తుది తీర్పుకు లోబడి నడుచుకుంటామని సంబంధిత అధ్యాపకులు ఇచ్చిన అండర్ టేకింగ్ విషయాన్ని ఆయనకు గుర్తు చేశారు.
News November 14, 2025
రామగుండం: ఖాళీ ప్లాట్ల ఓనర్లకు అదనపు కలెక్టర్ వార్నింగ్

రామగుండం మున్సిపల్ పరిధిలో ఖాళీ ప్లాట్లు పిచ్చిచెట్లతో పెరిగి, మురుగు నీరు నిలిచి దోమలు- పందుల పెరుగుదలకు కారణమవుతున్నాయని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), నగర పాలక సంస్థ కమిషనర్ జె.అరుణశ్రీ అన్నారు. ఇలాంటి స్థలాలను గుర్తించి యాజమానులకు నోటీసులు జారీ చేస్తున్నామని, నోటీసు వచ్చిన వారం రోజుల్లో శుభ్రపరచని పక్షంలో మున్సిపాలిటీల చట్టం- 2019 ప్రకారం ఓనర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


