News February 19, 2025

పదవ తరగతి పరీక్షలకు 26497 విద్యార్థులు: కలెక్టర్

image

పల్నాడులో 2025 పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు 26,497 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు తెలిపారు. విద్యాశాఖ అధికారులతో మంగళవారం 128 కేంద్రాలలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలన్నారు. విద్యాశాఖ అధికారులు తహశీల్దార్లతో సమన్వయం చేసుకొని విధుల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా ఉండాలన్నారు. డీఈవో చంద్రకళ, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 17, 2026

ఉమ్మడి వరంగల్‌లో జనాభా వివరాలు ఇలా..!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం జనాభా 36,88,217 మందిగా సర్వేలో తేలింది. ఇందులో వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా 8,36,811 మంది ఉండగా, మహబూబాబాద్ 8,04,515, హనుమకొండ 7,99,448, జనగామ 5,45,449, జయశంకర్ భూపాలపల్లి 4,07,896, ములుగు జిల్లాలో అత్యల్పంగా 2,94,098 మంది ఉన్నారు. కేటగిరీల వారీగా బీసీలు 18,37,374తో ముందుండగా, ఎస్సీలు 7,07,161, ఎస్టీలు 6,74,725, ఓసీలు 2,94,517 మంది ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

News April 17, 2026

శ్రీకాళహస్తి గుడిలో భారీ మార్పులు ఇవే..!

image

శ్రీకాళహస్తి గుడిలో జరిగే రాహుకేతు పూజల్లో భారీ మార్పులు చేశారు. ప్రారంభం టికెట్ రూ.500 ఉండగా దాన్ని రద్దు చేశారు. రూ.750, రూ.1500, రూ.2500 యథావిధిగా కొనసాగుతాయి. రూ.5వేల టికెట్‌ను రూ.6వేలకు పెంచారు. శ్రీకాళహస్తి లోకల్ ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రతి బుధవారం రూ.100లకే 2వేల మందితో సామూహికంగా రాహు కేతు పూజ చేయిస్తారు.

News April 17, 2026

ఖమ్మం: ‘డిగ్రీ ప్రవేశాలకు ‘దోస్త్’ నగారా’

image

డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ (DOST) తొలిదశ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మొహ్మద్ జాకీరుల్లా తెలిపారు. మే 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉందని, ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు. సందేహాల నివృత్తికి కళాశాల హెల్ప్‌లైన్ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.