News April 2, 2025

పది లక్షల మందితో వరంగల్‌లో BRS సభ!

image

ఈనెల 27న HNK ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈమేరకు ఉమ్మడి జిల్లా నాయకులతో మంగళవారం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అయితే సభకు, ఇతర అవసరాలకు దాదాపు 1200 ఎకరాల వరకు అవసరమని, RTC బస్సులతో పాటు ఇతర వాహనాలు 40 నుంచి 50 వేల వరకు వస్తాయని అంచనా వేస్తున్నట్లు సమాచారం. 10 లక్షల మందితో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 14, 2025

ములుగు కలెక్టర్‌ను ఇంటర్వ్యూ చేసిన బాలలు

image

ములుగు కలెక్టర్ దివాకర్‌ను విద్యార్థులు ఇంగ్లిషులో ఇంటర్వ్యూ చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా ఇంగ్లిష్ లెర్న్ టు రీడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టర్‌తో ముఖాముఖి నిర్వహించారు. అలవాట్లు, అభిరుచులు, తదితర విషయాలను అడిగారు. జిల్లాలోని 72 ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లిష్ చదవడం, నేర్చుకోవడం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

News November 14, 2025

మంత్రి లోకేశ్‌తో ఉష్ణమండల వ్యాధుల అధ్యయనాలపై చర్చలు

image

CII సమ్మిట్ సందర్భంగా ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ సిలై జాకి, ఆస్ట్రేలియా-ఇండియా CEO ఫోరమ్ డైరెక్టర్ జోడి మెక్కే, విశాఖ జేమ్స్ కుక్ విశ్వవిద్యాలయ ప్రతినిధులు మంత్రి లోకేశ్‌ను కలిశారు. తీరప్రాంత, సముద్ర పరిశోధన, ఉష్ణమండల వ్యాధుల అధ్యయనాలు, స్థిరమైన పర్యాటకం,గ్రీన్ ఎనర్జీ పాలసీలో ఏయూ భాగస్వామ్య బలోపేతంపై మాట్లాడారు. రాష్ట్రంలో ఉష్ణమండల నీటి పరిశోధన, ఆరోగ్యసంరక్షణ కేంద్రం ఏర్పాటుపై చర్చించారు.

News November 14, 2025

వైభవ్ ఊచకోత.. 32 బంతుల్లో సెంచరీ

image

మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో పసికూన UAE-Aని భారత్-A బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోస్తున్నారు. దోహాలో జరుగుతున్న టీ20లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ కొట్టారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న వైభవ్ ఏకంగా 9 సిక్సర్లు, 10 ఫోర్లు బాదారు. దీంతో ఇండియా-A 10 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 149 రన్స్ చేసింది.