News March 21, 2025

పది వార్షిక పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా జరిగింది: KMR కలెక్టర్

image

పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యయి. మొదటి రోజు ప్రశాంతంగా పరీక్ష జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కామారెడ్డిలోని గౌతమ్ ఉన్నత పాఠశాల కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలోని తరగతి గదులను పరిశీలించారు. మాల్ ప్రాక్టీస్ జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట కామారెడ్డి తహశీల్దార్ జనార్ధన్ ఉన్నారు.

Similar News

News April 19, 2025

ఏలూరు: రూ.5.71 కోట్లు ఖాతాల్లో జమ 

image

దెందులూరు, పెదవేగి, పెదపాడు మండలాల పరిధిలో 21 రైతు సేవా కేంద్రాల్లో రబీ కొనుగోళ్లు ప్రారంభించామని సివిల్ సప్లై జిల్లా అధికారి మూర్తి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఈ 3 మండలాల్లో 915 మంది రైతుల నుంచి రూ.27.62 కోట్లు విలువ గల 9474.240 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. సుమారుగా రూ.5.71 కోట్లు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయుట జరిగిందన్నారు.

News April 19, 2025

ATP: తాడిపత్రి ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పిస్తా – ఎంపీ

image

అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఉపకరణాలకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకుడు వై నారాయణరెడ్డి, మల్లికార్జున రెడ్డి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను శనివారం కలిశారు. అనంతపురంలోని ఎంపీ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎంపీ రూ. కోటి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 

News April 19, 2025

త్వరలో 20వేల ఉద్యోగాల భర్తీ: మంత్రి రాజనర్సింహ

image

యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు 20 వేలకు పైగా పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి పట్టణంలో 500 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను శనివారం ఆయన పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. ఎంపీ సురేశ్ శెట్కార్, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు.

error: Content is protected !!