News February 1, 2025
‘పది’ విద్యార్థుల అల్పాహారానికి నిధులు విడుదల: డీఈవో

జడ్పీ స్కూల్స్ ‘పది’ విద్యార్థులకు 30 రోజుల పాటు అల్పాహారం అందించనున్నట్లు డీఈవో సీవీ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ విద్యార్థికి రోజుకు రూ 07.50చొప్పున మొత్తం రూ.20,40,750 లను గుంటూరు జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి మంజూరు చేశారని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో ఆ నిధులు జమ చేశారన్నారు. ప్రతీ రోజు అరటిపండ్లు, బిస్కెట్లు, కోడిగుడ్లు, గుగిళ్ళు విద్యార్థులకు ఇవ్వాలన్నారు.
Similar News
News October 30, 2025
GNT: తొలగిన తుపాన్ ముప్పు.. సాధారణ స్థితికి జనజీవనం

తుపాను భయంతో కొద్ది రోజులుగా బిక్కు బిక్కు మంటూ ఇంటిపట్టునే కాలం గడిపిన జనం నెమ్మదిగా తేరుకుంటున్నారు. తుపాను తీరం దాటి ముప్పు తొలగిపోవడంతో రోజువారి కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. వర్షం ముసురు తొలగి సూర్య భగవానుడి రాకతో ఊపిరి పీల్చుకొంటున్నారు. సెలవుల అనంతరం విద్యా సంస్థలు కూడా తెరవడంతో పిల్లలు బడిబాట పట్టారు. దాదాపు నాలుగు రోజుల తర్వాత వీధులన్నీ రద్దీగా మారి జనజీవనం సాధారణ స్థితికి వచ్చింది.
News October 30, 2025
ప్రకాశం బ్యారేజీకి వరద హెచ్చరిక.!

మెంథా తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా, కృష్ణా నది ఉపనదులలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో కృష్ణా నదికి వేగంగా వరదలు వస్తున్నట్లు రివర్ కన్జర్వేటర్-కృష్ణ & ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో నేడు 6,00,000 క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని, వరద వేగంగా పెరుగుతోందని చెప్పారు. అన్ని విభాగాలు, సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News October 30, 2025
గుంటూరు జిల్లాను ముంచెత్తిన వాన

మొథా తుపాన్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురిశాయి. కాకుమానులో అత్యధికంగా 116.6 మి.మీ వర్షపాతం నమోదైంది. పెదనందిపాడు 114.6, ప్రత్తిపాడు 109.4, చేబ్రోలు 91.4, కొల్లిపర 78.4, వట్టిచెరుకూరు 76.2 మి.మీ వర్షపాతం నమోదైంది. తాడేపల్లి, దుగ్గిరాల, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం కురవడంతో తక్కువ ఎత్తున్న ప్రాంతాలు నీటమునిగాయి.


