News February 1, 2025

‘పది’ విద్యార్థుల అల్పాహారానికి నిధులు విడుదల: డీఈవో

image

జడ్పీ స్కూల్స్ ‘పది’ విద్యార్థులకు 30 రోజుల పాటు అల్పాహారం అందించనున్నట్లు డీఈవో సీవీ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ విద్యార్థికి రోజుకు రూ 07.50చొప్పున మొత్తం రూ.20,40,750 లను గుంటూరు జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి మంజూరు చేశారని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో ఆ నిధులు జమ చేశారన్నారు. ప్రతీ రోజు అరటిపండ్లు, బిస్కెట్లు, కోడిగుడ్లు, గుగిళ్ళు విద్యార్థులకు ఇవ్వాలన్నారు.

Similar News

News February 20, 2025

బ్యాలెట్ బాక్స్‌లను సక్రమంగా భధ్రపరచాలి: కలెక్టర్ 

image

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూంలో సక్రమంగా భద్రపరచాలని గుంటూరు జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎన్నికలకు విధులు కేటాయించిన అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా బ్యాలెట్ బాక్స్‌లు తీసుకునేటప్పుడు సీల్ పూర్తి స్థాయిలో వేసారా లేదా తనిఖీ చేసి బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు.

News February 19, 2025

జీబీఎస్‌తో గుంటూరు మహిళ మృతి

image

గిలియన్ బారో సిండ్రోమ్ (GBS)తో గుంటూరు నెహ్రూనగర్‌కి చెందిన మహిళ మరణించారు. ఒళ్ళు నొప్పులు, జ్వరంతో బాధపడుతూ గత కొద్దిరోజుల క్రితం నెహ్రూనగర్‌కి చెందిన గౌర్ జాన్ (65) జీజీహెచ్‌లో చేరారు. మొదటి మరణం సంభవించినప్పుడు జీబీఎస్ అంత ప్రమాదం ఏమీ కాదని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి చెప్పారు. కానీ ఇప్పుడు నగరానికి చెందిన మహిళ చికిత్స పొందుతూ మరణించడంతో గుంటూరు నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు.

News February 19, 2025

గుంటూరు: MDMA వినియోగిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థుల అరెస్ట్ 

image

MDMA నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తూ, వినియోగిస్తున్న 9 మంది ఇంజినీరింగ్ విద్యార్థులను గుంటూరు ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన నితిన్ కాజ గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సాయికృష్ణకు MDMA విక్రయించాడు. ఆ మత్తు పదార్థాలను సాయికృష్ణ గోరంట్లలో ఉంటూ ఇంజినీరింగ్ కళాశాలలకు విక్రయించాడు. మొత్తం 11 మంది ఉండగా 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. 

error: Content is protected !!