News March 16, 2025

పదోతరగతి పరీక్షలు పటిష్టంగా నిర్వహించాలి: కలెక్టర్

image

జిల్లాలో ఈనెల 17 నుంచి నిర్వహించే పదోతరగతి పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ వెట్రి సెల్వీ ఆదేశించారు. పేపరు లీకేజీలు వంటివి జరుగకుండా పటిష్ట భధ్రతా ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియా వంటి ప్రచార మాధ్యమాల్లో వదంతులు వ్యాపించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను అనుమతించరాదన్నారు.

Similar News

News November 17, 2025

HYD: iBOMMA రవి అరెస్ట్‌పై సీపీ ప్రెస్‌మీట్

image

iBOMMA రవి అరెస్ట్‌పై నేడు హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి సినీ హీరోలు, నిర్మాతలు హాజరుకానున్నారు. ఇప్పటికే ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ పోలీసులు బ్లాక్ చేశారు. ‘ఐబొమ్మ’ను నడుపుతూ క్రికెట్ బెట్టింగ్ సైట్‌లు ప్రమోట్ చేసి రవి రూ.కోట్లు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. రవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

News November 17, 2025

ఏపీలో టంగ్‌స్టన్ తవ్వకాలు.. HZLకు లైసెన్స్

image

ఏపీలో టంగ్‌స్టన్ బ్లాక్‌లను కనుగొని తవ్వకాలు జరిపేందుకు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్(HZL) సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందినట్లు సంస్థ తెలిపింది. క్రిటికల్, స్ట్రాటజిక్ మినరల్స్ అన్వేషణలో దేశం స్వయంప్రతిపత్తి సాధించడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని వెల్లడించింది. లైటింగ్ ఫిలమెంట్లు, రాకెట్ నాజిల్స్, ఎలక్ట్రోడ్లు, రేడియేషన్ షీల్డ్‌ల తయారీలో టంగ్‌స్టన్‌ను వాడతారు.

News November 17, 2025

MNCL: బైక్ చక్రంలో చీరకొంగు ఇరుక్కొని మహిళ మృతి

image

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి ఘటన స్థానికంగా కలకలం రేపింది. గోదావరిఖని గోదావరి బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. MNCL జిల్లా వేమనపల్లికి చెందిన లత(35) తమ్ముడు అరుణ్ బైక్ పై GDK నుంచి ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలో తన చీర కొంగు వెనుక వీల్‌లో ఇరుక్కుపోవడంతో ఇద్దరు కింద పడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా లత అక్కడికక్కడే మృతిచెందింది. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.