News March 16, 2025
పదోతరగతి పరీక్షలు పటిష్టంగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో ఈనెల 17 నుంచి నిర్వహించే పదోతరగతి పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ వెట్రి సెల్వీ ఆదేశించారు. పేపరు లీకేజీలు వంటివి జరుగకుండా పటిష్ట భధ్రతా ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియా వంటి ప్రచార మాధ్యమాల్లో వదంతులు వ్యాపించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను అనుమతించరాదన్నారు.
Similar News
News November 12, 2025
రికార్డు స్థాయిలో ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు

AP: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు జరగనున్నాయి. అన్నమయ్యలోని దేవగుడి పల్లి నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్గా వీటిని ప్రారంభిస్తారు. పీఎం ఆవాస్ యోజన కింద 2,28,034 లక్షలు, పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292, PMAY జన్మన్ పథకం కింద 6,866 ఇళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ఆయా జిల్లాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
News November 12, 2025
నేడు 8,086 మందికి సామూహిక గృహప్రవేశాలు

ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు శ్రీ సత్యసాయి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 8,086 మంది లబ్ధిదారులకు సామూహిక గృహప్రవేశ మహోత్సవం నిర్వహించనున్నట్లు గృహ నిర్మాణశాఖ అధికారి వెంకటనారాయణ తెలిపారు. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే, పీఎంఏవై (యూ) 2.0 కింద మంజూరైన 2,357 ఇళ్లకు పత్రాలు అందిస్తామని ఆయన చెప్పారు.
News November 12, 2025
బాల్య వివాహాలు ఎలా మొదలయ్యాయి?

బాల్య వివాహాలు ముందు నుంచే లేవు. క్రీస్తు పూర్వం 4 సంవత్సరం నుంచి ఇవి మొదలయ్యాయి. బొమ్మల పెళ్లిళ్లు వీటికి దోహదం చేశాయి. పరదేశీయులు దండయాత్రల్లో తమకు చిక్కిన ఆడపిల్లలను చెరిపేవారు. ఇలాంటి దుస్థితి రాకూడదని తల్లిదండ్రులు తమ బిడ్డలకు త్వరగా పెళ్లి చేసి అత్తారిండ్లకు పంపేవారు. అయితే ఈ సంస్కృతి కారణంగానే ఆడపిల్లలు వేదాలు చదవడం, విద్యను అభ్యసించడం నిషిద్ధం అనే దుష్ప్రచారం మొదలైంది. <<-se>>#Pendli<<>>


