News May 27, 2024
పదో తరగతి కొత్త పుస్తకంలో ‘దేవరగట్టు’ అంశం
కర్నూలు జిల్లాకు నూతన పాఠ్యపుస్తకాలు చేరాయి. రాష్ట్రంలో సంప్రదాయాలు, ప్రజల నమ్మకాలు తెలియజేయడంలో భాగంగా పదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో విజయదశమి రోజు అర్ధరాత్రి జరిగే బన్నీ జైత్రయాత్ర, కర్రల ఊరేగింపు(సమరం) గూర్చిన చరిత్ర ప్రచురించారు. దీంతో జిల్లా తెలుగు పండితులు, అధ్యాపకులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News October 10, 2024
భారతదేశం ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది: MP శబరి
టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతిపై నంద్యాల MP డా.బైరెడ్డి శబరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రతన్ టాటా దేశానికి అందించిన సేవలు ఎనలేనివి. నైతిక వ్యాపార పద్ధతుల పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భారతదేశం ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది’ అని ట్వీట్ పేర్కొన్నారు.
News October 10, 2024
KNL: బన్నీ ఉత్సవాలకు బందోబస్తు వివరాలు ఇలా!
కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని దేవరగట్టులో దసరా పురస్కరించుకొని నిర్వహించే బన్నీ ఉత్సవ ఏర్పాట్లకు ఎస్పీ బిందు మాధవ్ పట్టిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈమేరకు పోలీస్ బందోబస్తు వివరాలను ఎస్పీ వివరించారు. DSPలు-7, CIలు-42, SIలు-54, ASI, HCలు-112, PCలు-362, హోంగార్డులు-95 మంది, స్పెషల్ పార్టీ పోలీసులు-50తో పాటుగా 3 ప్లాటూన్ల AR పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించినట్లు వెల్లడించారు.
News October 9, 2024
పతకాలు సాధించిన క్రీడాకారులకు కలెక్టర్ అభినందన
రాజమండ్రిలో ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన కర్నూలు జిల్లా క్రీడాకారులను కలెక్టర్ రంజిత్ బాషా అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. కార్యక్రమంలో డీఎస్డీవో భూపతిరావు, అథ్లెటిక్స్ కోచ్ కాశీ రావు పాల్గొన్నారు.