News March 21, 2025

పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి:కలెక్టర్ 

image

రేపటి నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. పది పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితానికి మైలురాయి అని, దీన్ని అధిగమించడానికి మీరు ఎంత దృఢంగా నిలబడతారో తదుపరి ఉజ్వల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు.

Similar News

News December 10, 2025

NZB: తొలి విడతలో ఓటేసే వారు ఎంతమంది అంటే..?

image

తొలి విడతలో GP ఎన్నికలు జరిగే బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, వర్ని, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో 2,61,210 మంది ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. ఇందులో మహిళలు 1,37,413 మంది మహిళలు, పురుషులు 1,23,790, ఇతరులు ఏడుగురు ఉన్నారు. కాగా 11 మండలాల్లో 1,653 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

News December 10, 2025

అల్లూరి: ఫోన్‌ ఎక్కువ మాట్లాడొద్దని మందలించిన భర్తను చంపిన భార్య

image

భర్తను భార్య హత్య చేసిన ఘటన చింతపల్లి మండలం మేడూరులో జరిగింది. భార్య ఫోన్ ఎక్కువగా మాట్లాడుతోందని మందలించడంతో భర్త రాజారావుపై గొడ్డలితో భార్య దాడి చేసింది. తీవ్ర గాయాలైన రాజారావును స్థానికులు కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

News December 10, 2025

MBNR: మూడో విడతలో 440 మంది సర్పంచ్ అభ్యర్థులు.!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల మూడో విడత పోరు రసవత్తరంగా మారింది. ఈ విడతలో మొత్తం 440 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. అడ్డాకల్, బాలానగర్, భూత్పూర్, జడ్చర్ల, మూసాపేట మండలాలలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జడ్చర్ల మండలానికి సంబంధించి ఒక గ్రామ పంచాయతీలో నామినేషన్ సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు గురైనట్లు అధికారులు తెలిపారు.