News March 16, 2025
పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కోనసీమ డీఈవో

అంబేడ్కర్ కొనసీమ జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్షలు జరుగుతాయని డీఈవో సలీం భాషా ఆదివారం పేర్కొన్నారు. జిల్లాలో19,217 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని 110 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓపెన్ స్కూలుకు సంబంధించి 1,160 మంది విద్యార్థులు కోసం 19 సెంటర్లు ఏర్పాటు చేసామన్నారు. జిల్లాలో ఐదు మొబైల్ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహిస్తాయన్నారు.
Similar News
News November 8, 2025
రైల్వేలో 8,868 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

RRBలో 8,868 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు. గ్రాడ్యుయేట్ పోస్టులకు 18- 33ఏళ్లవారు ఈనెల 20 వరకు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 18- 30ఏళ్లున్న వారు ఈ నెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 8, 2025
APSRTCలో 277 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

APSRTCలో 277 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. కర్నూలు(46), నంద్యాల(43), అనంతపురం(50), శ్రీ సత్యసాయి(34), కడప(60), అన్నమయ్య(44) జిల్లాలో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ITI అర్హతగల అభ్యర్థులు www.apprenticeshipindia.gov.inలో నమోదు చేసుకున్న తర్వాత వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: apsrtc.ap.gov.in/
News November 8, 2025
గంభీరావుపేట: పంట పొలాల్లో రైతు మృతి

వరి పంట పొలంలో రైతు హఠాత్తుగా మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని గజ సింగవరం గ్రామానికి చెందిన ధ్యాన బోయిన విజ్ఞయ్య శుక్రవారం వరి పొలం కోయడానికి వెళ్లగా హఠాత్తుగా కిందపడి మృతి చెందాడు. తనకున్న ఎకరంలో వరి పంట సాగు చేశాడు. అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతో.. పంట చేతికస్తుందో లేదో అని ఆందోళనతో కుప్పకూలి హఠాన్మరణం చెందాడు.


