News March 19, 2024

పదో తరగతి పరీక్షలు..మొదటి రోజు 99.61% హాజరు

image

MBNR:పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు మొత్తం 12,738 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు 59 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెగ్యులర్ విద్యార్థులకు 58 కేంద్రాలు ఏర్పాటు చేయగా గతంలో అనుత్తీర్ణులై మళ్లీ ఫీజు చెల్లించిన వారికి ఒక కేంద్రం ఏర్పాటు చేశారు.జిల్లా కలెక్టర్ రవినాయక్-2,జిల్లాస్థాయిఅధికారులు-7,DEO రవీందర్-6,ప్లయింగ్ స్క్వాడ్స్ 24 కేంద్రాలను తనిఖీ చేశాయి.

Similar News

News November 24, 2025

జడ్చర్ల: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళుతున్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు వివరాలు ప్రకారం.. 167 జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 23, 2025

MBNR: పోలీస్ కార్యాలయంలో సత్యసాయిబాబా జయంతి వేడుకలు

image

పుట్టపర్తి సత్యసాయిబాబా 100వ జయంతి సందర్భంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.జానకి పూలమాల వేసి సత్యసాయి బాబా చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీసీఆర్‌బీ డీఎస్సీపీ రమణారెడ్డి, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, శైలు‌తో పాటు పోలీస్ శాఖకు చెందిన ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

News November 23, 2025

అరుణాచలం వెళ్లే భక్తులకు పాలమూరు డిపో శుభవార్త

image

మహబూబ్ నగర్ జిల్లా నుంచి తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల ప్రదక్షణకు వెళ్లే భక్తులకు డిపో మేనేజర్ సుజాత శుభవార్త తెలిపారు. డిసెంబర్ 3న బస్సు సాయంత్రం 7 గంటలకు బయలుదేరుతుందన్నారు. ప్యాకేజీ రూ.3600 ఉంటుందన్నారు. https://tsrtconline.in బుక్ చేసుకోవాలని తెలిపారు. 9441162588 నంబర్‌‌ను సంప్రదించాలన్నారు.