News July 6, 2024
పదో తరగతి పాఠ్యాంశంలో పాడేరు మోదకొండమ్మ జాతర

పాడేరులో జరిగే మోదకొండమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి తెలుగు పాఠ్యాంశంలో చేర్చింది. ప్రతి ఏటా మే నెలలో మూడు రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం 2014లో దీనిని రాష్ట్ర జాతరగా గుర్తించింది. ప్రభుత్వం మోదకొండమ్మ జాతరను పదో తరగతి పాఠ్యాంశంలో పెట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 25, 2025
మంత్రి సత్యకుమార్ విశాఖ పర్యటన వివరాలు

రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అక్టోబర్ 26, 27 తేదీల్లో విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అక్టోబర్ 27న ఉదయం ఏఎంసీ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం VIMS క్యాంపస్, ఆరిలోవలో ప్రాంతీయ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం లాసెన్స్ బేలోని బీజేపీ కార్యాలయంలో స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
News October 25, 2025
విశాఖ మత్స్యకారులకు గమనిక

తుఫాను ఏర్పడిన నేపథ్యంలో సముద్రంపై మత్సకారులకు వేటకు వెళ్లొద్దని మత్స్యశాఖ జేడీ పి.లక్ష్మణరావు సూచించారు. బీచ్ రోడ్డులోని జాలరిపేట వద్ద తుఫాన్ విషయంపై ముందస్తు జాగ్రత్తలు వివరించారు. సముద్రంలో వేట సాగిస్తున్న ఫిషింగ్ బోట్లు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలన్నారు. తీరంలో భద్రపరచుకున్న సామగ్రిని సురక్షిత ప్రాంతానికి తరలించాలన్నారు. సమస్య ఎదురైతే వెంటనే సమాచారం అందించాలన్నారు.
News October 25, 2025
విశాఖలో సెలవులు రద్దు: కలెక్టర్

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాబోయే 72 గంటలు అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు, పెనుగాలుల ప్రమాదం ఉన్నందున అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.


