News July 6, 2024

పదో తరగతి పాఠ్యాంశంలో పాడేరు మోదకొండమ్మ జాతర

image

పాడేరులో జరిగే మోదకొండమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి తెలుగు పాఠ్యాంశంలో చేర్చింది. ప్రతి ఏటా మే నెలలో మూడు రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం 2014లో దీనిని రాష్ట్ర జాతరగా గుర్తించింది. ప్రభుత్వం మోదకొండమ్మ జాతరను పదో తరగతి పాఠ్యాంశంలో పెట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 25, 2025

విశాఖ: ఐఫోన్ కొనివ్వలేదని బాలుడి సూసైడ్

image

ఐఫోన్ కొనివ్వలేదని తల్లిదండ్రుల మీద అలిగి బాలుడు(17) ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం.. ఆరో తరగతి వరకు చదువుకున్న బాలుడు చదువు మానేసి ఇంట్లోనే ఉండేవాడు. తల్లిదండ్రులు కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించేవారు. ఐఫోన్ కావాలని తండ్రితో గొడవ పడి ఇంటికి రావడం మానేశాడు. కాగా సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చి ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

News November 25, 2025

ఫార్మా బస్సులకు గాజువాకలోకి నో ఎంట్రీ

image

గాజువాకలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం కావడంతో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫార్మా కంపెనీ బస్సులు అధిక సంఖ్యలో సిటీలోకి రావడంతో సమస్య అధికమైందని, వాటిని నేటి నుంచి అనుమతించబోమన్నారు. ఇప్పటికే యజమానులు, డ్రైవర్లకు సమాచారమిచ్చామన్నారు. గాజువాకకు రెండు కి.మీ దూరంలో ఉన్న శ్రీనగర్ జంక్షన్ వరకు మాత్రమే ఫార్మా బస్సులకు అనుమతి ఉంటుందని వివరించారు

News November 25, 2025

విశాఖ: ‘లింగ ఆధారిత వివక్షపై నివార‌ణ చర్య‌ల‌ను బ‌లోపేతం చేయాలి’

image

లింగ ఆధారిత వివ‌క్ష‌పై పోరాటం చేసేందుకు పౌరులంద‌రిలో బాధ్య‌త పెర‌గాల‌ని క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్రసాద్ సూచించారు. సోమవారం ఆయన ఇందుకు సంబంధించిన పోస్టులను ఆవిష్కరించారు. మంగళవారం నుంచి డిసెంబ‌ర్ 23 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న జెండ‌ర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్పు కోసం ముందడుగు అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.