News April 15, 2025
పదో తరగతి మూల్యాంకనం పూర్తి: డీఈవో సత్యనారాయణ

జిల్లాలో జరిగిన పదో తరగతి పరీక్షల జవాబు ప్రశ్నపత్రాల మూల్యాంకనం పూర్తైనట్లు డీఈవో సత్యనారాయణ తెలిపారు. బీబీనగర్ మండలం గూడూరులో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ నెల 7 నుంచి 15 వరకు జరిగిన మూల్యాంకనంలో 1,60,997 జవాబు పత్రాలను 781 మంది ఉపాధ్యాయులు మూల్యాంకనం చేశారన్నారు. వాల్యువేషన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా జరిగిందన్నారు.
Similar News
News November 28, 2025
వరంగల్: ప్రైవేట్ పీఏకు రూ.90 వేలు

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఫెయిలైనవారికి మార్కులు కలపడంతో మొదలైన అవినీతి బండారం విజిలెన్సు విచారణలో విస్తుపోయేలా బయటకు వస్తున్నాయి. WGL విజిలెన్సు అధికారుల చేతిలో అవినీతి చిట్టా ఉన్నట్లు తెలిసింది. నోటిఫికేషన్ లేకుండా ప్రైవేట్గా ఉద్యోగులను పెట్టుకున్న విషయం బయటకు వచ్చింది. రూ.90 వేల వేతనంతో కాంట్రాక్టు పద్ధతిలో వీసీ పీఏను అంటూ చలామణి అవుతున్న వ్యక్తి బండారం బయటపడింది.
News November 28, 2025
పల్నాడు పర్యాటకం ఇక కళకళ..

పర్యాటక శాఖ స్వదేశీ దర్శన్లో భాగంగా పల్నాడు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అమరావతిలోని 125 అడుగుల జ్ఞాన బుద్ధ విగ్రహం, కోటప్పకొండ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే DPR సిద్ధం చేశారు. సాగర్ వద్ద వరల్డ్ క్లాస్ బుద్ధిష్ట్ హెరిటేజ్ సెంటర్, గుత్తికొండ బిలం రహదారి, అమరావతి కాలచక్ర మ్యూజియం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
News November 28, 2025
మిరపలో మొవ్వుకుళ్లు తెగులు లక్షణాలు

మొవ్వుకుళ్లు తెగులు ఆశించిన మిరప మొక్కల చిగుర్లు ఎండిపోతాయి. కాండంపై నల్లని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి. కొన్ని మొక్కల్లో ఆకులపై వలయాలుగా మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. మొవ్వుకుళ్లు తెగులు ముఖ్యంగా తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. బెట్టపరిస్థితులలో, అధిక నత్రజని మోతాదు వలన, తామర పురుగుల ఉద్ధృతి ఎక్కువవుతుంది. నీటి ద్వారా ఈ వైరస్ ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది


