News March 2, 2025

పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ ‘విజయోస్తు’ లేఖ

image

ఈనెల 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షకు ప్రారంభం కానున్న నేపథ్యంలో జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా స్వయంగా లిఖించి ముద్రించిన ‘ విజయోస్తు ‘ లేఖలను విద్యార్థులకు అందిస్తున్నారు. పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు కావాల్సిన పంచసూత్రాలను పాటిస్తూ చదవాలని లేఖలో పొందుపరిచారు. జిల్లాలోని ప్రతి విద్యార్థికి ఈ లేఖలను కలెక్టర్ అందించి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Similar News

News October 31, 2025

WWC: ఈసారి విశ్వవిజేత ఎవరో?

image

సెమీస్‌లో ఆసీస్‌పై గెలుపుతో హర్మన్ సేన నిన్న ఫైనల్‌లోకి అడుగు పెట్టి SAతో NOV 2న తలపడనున్న విషయం తెలిసిందే. 1973 నుంచి మహిళల వరల్డ్ కప్ జరుగుతుండగా కేవలం 3 జట్లే విజేతలుగా నిలిచాయి.
1973: ఇంగ్లండ్, 1978: ఆస్ట్రేలియా, 1982: ఆస్ట్రేలియా, 1988: ఆస్ట్రేలియా, 1993: ఇంగ్లండ్, 1997: ఆస్ట్రేలియా, 2000: న్యూజిలాండ్, 2005: ఆస్ట్రేలియా, 2009: ఇంగ్లండ్, 2013: ఆస్ట్రేలియా, 2017: ఇంగ్లండ్, 2022: ఆస్ట్రేలియా.

News October 31, 2025

ఆలయాల్లో ధ్వజస్తంభం ఎందుకు?

image

ధ్వజం అంటే పతాకం. ధ్వజస్తంభం ఉత్సవానికి సంకేతం. హైందవ సంస్కృతిలో దీని చుట్టూ ప్రదక్షిణ చేశాకే దైవదర్శనం చేసుకోవాలని చెబుతుంటారు. ఆలయోత్సవాలు మొదలయ్యేటప్పుడు ఈ స్తంభంపై జయపతాకాన్ని ఎగురవేస్తారు. ధ్వజస్తంభం లేని ఆలయాలకు స్వాములు దేవాలయ గుర్తింపు ఇవ్వరనే నమ్మకం ఉంది. దీనిని ఆలయ హృదయంగా భావిస్తారు. ఇది భక్తులకు శక్తిని, శుభాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. అందుకే ప్రతి ఆలయంలో దీన్ని ప్రతిష్ఠిస్తారు.

News October 31, 2025

ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలి: CM

image

AP: ఇకపై ప్రతి నెలా, ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను CM CBN ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షించిన ఆయన, ‘నైపుణ్యం’ పోర్టల్ ఉద్యోగాల గేట్ వేగా ఉండాలన్నారు. NOVలో జరిగే CII సదస్సులోగా పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జాబ్ మేళాల ద్వారా 1,44,000 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు CMకు తెలిపారు.