News March 19, 2024

పదో తరగతి విద్యార్థులను డిబార్ చేసిన జాయింట్ కలెక్టర్

image

WNPT: పదో తరగతి తొలి పరీక్షలో మాస్ కాపీయింగ్ కు పాల్పడిన ఇద్దరు విద్యార్థినులు డీబార్ కావడం ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. శ్రీరంగాపురం ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని జేడీ వెంకటనర్సమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను తనిఖీచేసే క్రమంలో ఇద్దరి వద్ద చిట్టీలు ఉండటంతో డీబార్ చేయాలని డీఈఓకు  ఆదేశాలు జారీ చేశారు. మాస్ కాపీయింగ్ పై చీఫ్ సూపరింటెండెంట్ వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు.

Similar News

News April 8, 2025

MBNR: దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపుహాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 92 ఫిర్యాదులను స్వీకరించారు. ఏ వారం దరఖాస్తులు ఆ వారమే పరిష్కరించాలని పదేపదే హెచ్చరిస్తున్న నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. శనివారంలోగా దరఖాస్తులను పరిష్కరించి తనకు నివేదిక ఇవ్వాలన్నారు.

News April 7, 2025

మహబూబ్‌నగర్: ‘మాంసం వారానికి ఒకసారే తినండి’

image

ఉమ్మడి <<16019120>>పాలమూరులో<<>> 18 ఏళ్లు పైబడిన వారిలో సగటున 20 శాతం అంటే 87,739 మంది అధిక రక్తపోటు బాధితులే ఉన్నారు. క్యాన్సర్ రోగులు 188మంది, మధుమేహ వ్యాధిగ్రస్థులు 50,421మంది ఉన్నారు. మటన్, ఆయిల్‌ఫుడ్, అధిక ఉప్పు, పచ్చడి, తంబాకు, గుట్కా, బ్రెడ్, బేకరీ ఫుడ్ తినొద్దని, స్కిన్‌లెస్ చికెన్, గుడ్డు తెల్ల సొన, ఉడకబెట్టిన కూరగాయలు, పాలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వారానికి ఒకసారి మాత్రమే మాంసం తినాలన్నారు.

News April 7, 2025

వనపర్తి: ‘సింగోటం గుడిలో ప్రేమ జంట పెళ్లి చేస్తాం’

image

తమకు పెళ్లి చేయాలని వనపర్తి జిల్లా పానగల్ PSకు వచ్చిన <<16017433>>నందిని, మహేందర్<<>> పెళ్లి త్వరలో చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. నందిని హైదరాబాద్‌లో ఫామ్-డి చదువుతోందని, మహేందర్ డిగ్రీ చదివి జాబ్ సెర్చ్ చేస్తున్నాడన్నారు. ఇద్దరు మేజర్లు, అందులోనూ చదువుకున్న వారు కావడంతో వారి పెళ్లికి కుటుంబీకులను ఒప్పించామని చెప్పారు. మంచి ముహూర్తం చూసి త్వరలో కొల్లాపూర్ పరిధి సింగోటం గుడిలో పెళ్లి చేస్తామన్నారు.

error: Content is protected !!