News January 23, 2025
పదో తరగతి విద్యార్థులపై దృష్టి సారించండి: నిర్మల్ DEO

పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని DEO రామారావు అన్నారు. బుధవారం ముధోల్ మండలం అష్ట ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వెనుకబడిన వారిని ప్రత్యేక తరగతుల ద్వారా ప్రోత్సహించాలన్నారు. పదో వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.
Similar News
News December 5, 2025
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు: కలెక్టర్

నిబంధనల ప్రకారం పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జోనల్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన పోలింగ్ అధికారులందరూ విధులకు హాజరయ్యేలా పర్యవేక్షించాలని అన్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగే రోజే ఉప సర్పంచ్ ప్రక్రియ ముగిసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
News December 5, 2025
ఆయుష్మాన్ భారత్ పథకంలో మధుమేహ రోగులను చేర్చాలి: ఎంపీ

ఆయుష్మాన్ భారత్ పథకంలో టైప్-1 మధుమేహం రోగులను, అవుట్ పేషెంట్ సేవలు కూడా చేర్చాలని ఎంపీ శ్రీ భరత్ పార్లమెంట్ సమావేశాల్లో కోరారు. ఇన్సులిన్, గ్లూకోజ్ లాంటి ముఖ్య ఔషధాలు ప్రజారోగ్య సంస్థల్లో నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్సులిన్ ఒక మందు మాత్రమే కాదని, జీవనాధారమన్నారు. వీటి లభ్యత, ధరల సమస్య కారణంగా ఎవరూ ప్రాణం కోల్పోకూడదని, ఈ విషయంలో కేంద్రం తక్షణమే స్పందించాలన్నారు.
News December 5, 2025
విశాఖ: పాఠశాలలో బాలికల వాష్రూమ్ వద్ద యువకుడి వెకిలి చేష్టలు

చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఓ అపరిచిత వ్యక్తి అనుమానాస్పదంగా వ్యవహరించాడు. పాఠశాలలోకి ప్రవేశించిన యువకుడు బాలికల వాష్రూమ్ వద్ద వెకిలి చేష్టలకు పాల్పడుతుండటాన్ని విద్యార్థినులు గమనించారు. వెంటనే వారు ప్రధానోపాధ్యాయులు ములుగు వెంకటరావుకు సమాచారం అందించారు. ప్రధానోపాధ్యాయుడు తక్షణమే పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


