News January 28, 2025
పద్మనాభం: రెండు కుంటుబాల్లో తీవ్ర విషాదం

పద్మనాభం మండలం కృష్టాపురంలో ఒకే రోజు <<15283151>>ఇద్దరు సూసైడ్<<>> చేసుకున్న ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వివాహిత కనకల లక్ష్మి(30) మరణంతో ఆమె ఇద్దరు కుమారులు తల్లి లేనివారయ్యారు. ఒక్కగానొక్క కొడుకు మొరక ఆదిత్య(22) ఇంక లేడన్న వార్తను అతని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆటల్లో చురుగ్గా ఉండే ఆదిత్య తండ్రి వైద్యారోగ్యశాఖలో చిరుద్యోగి కాగా.. లక్ష్మి భర్త లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు.
Similar News
News January 3, 2026
విశాఖ: సోమవారం నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు

విశాఖ జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో జనవరి 5 నుంచి 9 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న 1.09 లక్షల తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ల (MBU) పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగే ఈ సదుపాయాన్ని విద్యార్థులు, ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
News January 3, 2026
విశాఖ: సొంత భవనంలోకి NIO ప్రాంతీయ కార్యాలయం

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫి విశాఖ ప్రాంతీయ కార్యాలయం త్వరలో సొంత భవనంలోకి మారనుంది. సముద్ర తీర పరిశోధనల కోసం 1976 నుంచి పెదవాల్తేరు బస్ డిపో సమీపంలో అద్దె భవనంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా బీచ్ రోడ్డులోని రాడిసన్ బ్యూ రిసార్ట్ సమీపంలో 3 ఎకరాల్లో నూతన భవన నిర్మాణం పూర్తయింది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనాన్ని త్వరలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News January 3, 2026
విశాఖ: న్యూఇయర్ రోజు మర్డర్.. కారణం ఇదేనా?

విశాఖ జిల్లా కాకానినగర్లో న్యూఇయర్ రోజు <<18740809>>దారుణ హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎయిర్పోర్ట్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న దిలీప్ తమను తిట్టాడనే కారణంతో ఈ ఇద్దరు యువకులు కర్రలతో దాడి చేసి చంపినట్లు సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలుకోణాల్లో విచారిస్తున్నట్లు సీఐ శంకర్ నారాయణ శనివారం తెలిపారు.


