News April 6, 2025

పద్మావతి అమ్మవారి సేవలో సుప్రీంకోర్టు జడ్జి

image

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కుటుంబ సమేతంగా శనివారం రాత్రి దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద టీటీడీ ఈఓ శ్యామలరావు, కలెక్టర్ వెంకటేశ్వర్, జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈఓ గోవిందరాజన్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Similar News

News November 21, 2025

90 ఏళ్ల క్రితమే మన సినిమాల్లో కిస్ సీన్!

image

ఇండియన్ సినిమాలో ముద్దు సీన్లు ఇప్పుడు కామన్. కానీ 90 ఏళ్ల క్రితమే మన సినిమాల్లో ముద్దు సీన్ స్టార్ట్ చేశారనే విషయం మీకు తెలుసా? 1933లో వచ్చిన ‘కర్మ’ చిత్రంలో నటీనటులు దేవికా రాణి, హిమాన్షు రాయ్ (నిజ జీవితంలో భార్యాభర్తలు) సుదీర్ఘమైన తొలి ముద్దు సీన్లో నటించారు. దాదాపు 4 నిమిషాల పాటు సాగిన ఈ ముద్దు సన్నివేశం అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిందని సినీవర్గాలు చెబుతున్నాయి.

News November 21, 2025

VJA: క్యాంపు కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్

image

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరించిన మంత్రి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండడం, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు.

News November 21, 2025

ఆక్వా రంగాన్ని APకి ఆశాకిరణంలా తీర్చిదిద్దుతాం: CBN

image

AP: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ సముద్ర తీరం, డెల్టా ప్రాంతం మనల్ని బ్లూ ఎకానమీలో దేశంలోనే ముందు నిలిపాయన్నారు. ‘వేట నిషేధ సమయంలో 1.29L మందికి ₹20వేల చొప్పున ₹259 కోట్లు ఇచ్చాం. ఆక్వారంగం బలోపేతానికి ₹1.50కే యూనిట్ విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆక్వా రంగాన్ని ఏపీకి ఆశాకిరణంలా తీర్చిదిద్దుతాం’ అని ట్వీట్ చేశారు.