News June 26, 2024
పద్మ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజల నుంచి పద్మ పురస్కారాలు-2025 సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుందని ఉమ్మడి గుంటూరు స్టెప్ సీఈవో కె. వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సాంఘిక సేవా కార్యక్రమాలు, సైన్స్ రంగాల్లో విశేష కృషి, సాధించిన ప్రగతిని తెలియజేస్తూ 800 పదాలు మించకుండా నివేదికను తయారుచేసి నిర్ణీత దరఖాస్తును ఆన్ లైన్ లో సమర్పించాలన్నారు.
Similar News
News November 11, 2025
పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్థ వహించాలి: DEO

పదవతరగతి విద్యార్థులను ప్రణాళికా బద్దంగా చదివించాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఉపాధ్యాయులకు సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలోని SKVRN, LMPహైస్కూల్స్ ని మంగళవారం డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా SA-1పరీక్షల ప్రక్రియను పరిశీలించారు. పది విద్యార్థులను గ్రేడ్లుగా విభజించి చదివించాలన్నారు. రానున్న పబ్లిక్ పరీక్షల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు.
News November 11, 2025
అయ్యో పాపం.. ఆస్పత్రి ఆవరణలో అనాధగా పడి ఉన్న వృద్ధుడు

తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఓ వృద్ధుడు అనాధగా దీన స్థితిలో పడి ఉన్నాడు. ఎక్కడ నుంచి వచ్చాడో తెలీదు కానీ ఆస్పత్రి ప్రాంగణంలో ఆరు బయట నీరసించి పడి ఉండటం చూపురులను కలచివేస్తోంది. అనారోగ్యంతో బక్కచిక్కి ఉన్న ఆయన పరిస్థితి చూసి అటుగా వెళుతున్న వారు అయ్యో పాపం అంటున్నారే తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు. వృద్ధుడికి యూరిన్ పైప్ అమర్చి ఉందని, మాట్లాడే స్థితిలో కూడా లేడని స్థానికులు చెబుతున్నారు.
News November 11, 2025
కృష్ణా నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

తాడేపల్లి పరిధి సీతానగరంలోని కృష్ణానదిలో మంగళవారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ ఖాజావలి తెలిపారు. మృతుని వయస్సు సుమారు 30నుండి 34 ఏళ్ల మద్యలో ఉంటుందని మృతుడు నలుపు రంగు ఫ్యాంటు, నీలం రంగు చొక్కా ధరించినట్లు చెప్పారు. మృతుని వివరాలు తెలిస్తే 86888 31364 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు.


