News March 5, 2025
‘పని ప్రదేశంలో ఇంటర్నల్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి’

పని ప్రదేశాలలో మహిళలను లైంగికంగా వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని అన్నారు. బుధవారం వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలDలో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News January 20, 2026
NZB: CM దావోస్ ట్రిప్ దండగ.. Xలో కల్వకుంట్ల కవిత

CM రేవంత్ రెడ్డి ట్రిప్ దండగ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత Xలో విమర్శించారు. ఎక్కే విమానం – దిగే విమానం .. రూ. లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచారం తప్ప రెండేళ్లలో తెలంగాణకు మీరు తెచ్చిందేమిటి అని ప్రశ్నించారు. దావోస్ సమ్మిట్లు, TG రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో చేసుకున్న MOUలలో ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి.. ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
News January 20, 2026
కోటప్పకొండకు రానున్న డిప్యూటీ సీఎం పవన్: ఎమ్మెల్యే

కోటప్పకొండ అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. కోటప్పకొండలో నూతన రహదారుల ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించగా, ఈ నెల 22న వస్తానని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి ఏర్పాట్లను కూడా పరిశీలించనున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
News January 20, 2026
హ్యాట్సాఫ్.. రూ.2కోట్ల ఆస్తిని దానం చేశారు

AP: నంద్యాల జిల్లా జలదుర్గానికి చెందిన పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. పిల్లలులేని ఈ దంపతులు తమ యావదాస్తిని మాధవరం రాములవారి గుడికి విరాళమిచ్చారు. దాదాపు రూ.2కోట్ల విలువజేసే ఆస్తి ఆలయానికి చెందేలా రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక్క రూపాయి దానం చేయాలన్నా వందసార్లు ఆలోచించే ఈ రోజుల్లో అంత ఆస్తిని గుడికి రాసిచ్చేసిన ఈ దంపతులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.


