News January 24, 2025
పనులను నాణ్యతతో చేపట్టాలి: జనగామ అదనపు కలెక్టర్

పాఠశాల మరమ్మతు పనులను నాణ్యతతో చేపట్టాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల, మల్కాపూర్, పల్లగుట్ట, చిల్పూర్ లలో చేపడుతున్న పాఠశాల మరమ్మతు పనులను సందర్శించి పరిశీలించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు.
Similar News
News October 31, 2025
KKD: ఎడమొహం పెడమొహంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..?

KKD ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, MLC కర్రి పద్మశ్రీ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయని చర్చ సాగుతోంది. శ్రీలంక నుంచి మత్స్యకారులు వచ్చిన సందర్భంలో ఎమ్మెల్సీని కొండబాబు తోసేశారని ఆమె అనుచరులు ఆరోపించారు. తాజాగా గురువారం మత్స్యకారులకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో పద్మశ్రీని వేదికపైకి ఆహ్వానించలేదని, దీంతో ఆమె కార్యక్రమం నుంచి వెళ్లిపోయారని వారు తెలిపారు.
News October 31, 2025
ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో విషాదం.. కరెంట్ షాక్తో మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం నాంచారిపేట గ్రామానికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ ఎండీ కరీం(50) శుక్రవారం సాయంత్రం కరెంట్ షాక్తో మృతి చెందాడు. గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇంట్లో పనులు జరుగుతుండగా, విద్యుత్ లైట్ సరిచేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఆయన మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు నింపింది.
News October 31, 2025
బ్యాంకులకు కొత్త డొమైన్.. నేటితో ముగిసిన గడువు

సైబర్ నేరాలను తగ్గించడమే లక్ష్యంగా బ్యాంకులు తమ వెబ్సైట్లను .bank.in డొమైన్కు మార్చుతున్నాయి. ఇందుకు RBI విధించిన గడువు నేటితో ముగిసింది. ఇప్పటి వరకు SBI, PNB, CANARA వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు HDFC, ICICI, AXIS, కోటక్ మహీంద్రా వంటి ప్రైవేటు బ్యాంకులూ కొత్త డొమైన్కు మారాయి. మరికొన్ని బ్యాంకులు .comతో కొనసాగుతూ ఏదైనా కేటగిరీ ఎంచుకున్నప్పుడు .bank.inకు రీడైరెక్ట్ చేస్తున్నాయి.


