News April 1, 2025
పన్నుల ద్వారా ఇప్పటివరకు రూ.80 కోట్లకు పైగా ఆదాయం: కమిషనర్

పన్ను ద్వారా బల్దియాకు సుమారు రూ.80 కోట్లకు పైగా ఆదాయం వసూలు చేసినట్లు బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. హన్మకొండ అశోక టాకీస్ వద్ద గల ఈ సేవా కేంద్రాన్ని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పన్ను వసూళ్ల తీరును పరిశీలించారు. రెగ్యులర్ పన్ను వసూళ్లతో పాటు ఆస్తి పన్నుపై 90% వడ్డీ మాఫీ పథకంను సద్వినియోగం చేసుకోవడం ద్వారా సుమారు రూ.80 కోట్లకు పైగా వసూళ్లు జరిపామని అన్నారు.
Similar News
News October 30, 2025
మంచిర్యాల: పాఠశాలలకు సెలవులు ప్రకటించాలి: MCPIU

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఎంసీపీఐయూ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ.. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాల కారణంగా విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సెలవులు ప్రకటించాలని కోరారు.
News October 30, 2025
అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా పంకజ్ కుమార్ మీనా

చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా నియమితులయ్యారు. ఈమేరకు DGP హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 2020 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన పంకజ్ కుమార్ మీనా చింతూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలో గంజాయి నిర్మూలన, మావోయిస్టుల కార్యకలాపాల నియంత్రణకు విశేష కృషి చేశారు.
News October 30, 2025
ఖమ్మం: బట్టిపట్టే చదువుకు స్వస్తి – ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ ప్రారంభం

ప్రతి విద్యార్థిలో చదివే సామర్థ్యం పెంపొందించే లక్ష్యంతో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు రోజూ గంటసేపు రీడింగ్ స్కిల్స్ అభ్యాసం చేయించాలని సూచించారు. 30 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి విద్యార్థి చదివి అర్థం చేసుకునే స్థాయికి చేరడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు.


