News August 23, 2024

పబ్జి గేమ్‌లు ఆడుతూ ఐదేళ్లు నెట్టుకొచ్చేశారు: మంత్రి సవిత

image

రాష్ట్రాన్ని, వ్యవస్థలను విధ్వంసం చేసిన ఘనత జగన్‌దే అని మంత్రి సవిత అన్నారు. శుక్రవారం అమరావతిలో ఆమె మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ నీరో చక్రవర్తిలా ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్‌లు ఆడుతూ ఐదేళ్లు నెట్టుకొచ్చేశారని విమర్శించారు. గత ఏడాది ఇచ్చిన థర్డ్‌ పార్టీ నివేదిక అమలు చేయకపోవడం వల్లే అచ్యుతాపురంలోని ఎసెన్షియాలో ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఇకనైనా జగన్‌ శవ రాజకీయాలు మానుకోవాలని సవిత హితవు పలికారు. 

Similar News

News January 23, 2026

గుంటూరు: ‘వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం’

image

గుంటూరు జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో UPHCలు, PHCలలో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించినట్లు DMHO విజయలక్ష్మి తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డీఈఓ, ఎఫ్‌ఎన్‌వో, శానిటరీ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 2 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫారములు వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలు www.guntur.ap.gov.in‌లో అందుబాటులో ఉన్నాయి.

News January 23, 2026

పొన్నూరు విద్యార్థికి రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్

image

గుంటూరు జోనల్ స్థాయిలో గురువారం జరిగిన స్పెల్ బీ పోటీలలో పొన్నూరు విద్యార్థి పొట్లూరి దేవేశ్ ప్రథమ స్థానంలో నిలిచాడు. పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న దేవేశ్ జోనల్ స్థాయిలో ప్రథమ స్థానం పొంది రాష్ట్రస్థాయిలో 4వ తరగతి విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో విద్యార్థి దేవేశ్‌ను మండల విద్యాశాఖ అధికారులు ధూపం రాజు, కొల్లి విజయభాస్కర్, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు అభినందించారు.

News January 23, 2026

గుంటూరు ప్రజలకు ఎస్పీ ముఖ్య సూచన

image

గుంటూరు జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని SP వకుల్ జిందాల్ సూచించారు. సీనియర్ సిటీజన్స్, విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారుల మాదిరిగా కొందరు ఫోన్లు చేసి కేసులు నమోదైనట్లు బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. అనుమానస్పద ఫోన్లు వస్తే వెంటనే కట్ చేసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని అన్నారు. వాట్సప్‌లో వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు.