News January 30, 2025
పబ్లిసిటీ చేసుకోవడంలో జగన్ ఫెయిల్ అయ్యారు: కేతిరెడ్డి

వైసీపీ ప్రభుత్వంలో చేసిన డెవలప్మెంట్ను పబ్లిసిటీ చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి విఫలం అయ్యారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు చెప్పేది అబద్ధమే అయినా ప్రజలు నమ్మే విధంగా చెబుతారు. అలా 4 సార్లు అబద్ధాలు చెప్పి గెలిచారు. డెవలప్మెంట్పై జగన్ దృష్టి పెట్టలేదనేది ఆరోపణ. వెల్ఫేర్కు అయినంత పబ్లిసిటీ డెవలప్మెంట్కు కాలేదు.’ అని అన్నారు.
Similar News
News February 16, 2025
చెత్త విషయంలో తల్లి, కొడుకుపై కత్తితో దాడి

గుత్తి ఆర్ఎస్లో చెత్త పడేసే విషయంలో ఇరువర్గాల మధ్య ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది. ఇంటిముందు చెత్త పడేశారని వంశీ, అతని తల్లి సాయమ్మపై రిజ్వానా, రసూల్ కత్తితో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వంశీ, సాయమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం రెఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
News February 16, 2025
విద్యార్ధి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలి: JNTU ఇన్ఛార్జ్ వీసీ

అనంతపురంలోని JNTU-OTPRIలో శనివారం ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఇన్ఛార్జ్ వీసీ సుదర్శన రావు పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉద్యోగం కోసం కాకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ వీసీతో పాటు పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
News February 16, 2025
అనంత: సేవాగడ్లో డోలు, కత్తి పట్టిన కలెక్టర్

గుత్తి మండలం చెర్లోపల్లి సేవాఘడ్లోని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ను శనివారం అనంత ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ దర్శించుకున్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అనంతరం కలెక్టర్కు ఆలయ కమిటీ సభ్యులు డోలు, కత్తిని అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలను లోకల్ ఫెస్టివల్గా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.