News January 30, 2025

పబ్లిసిటీ చేసుకోవడంలో జగన్ ఫెయిల్ అయ్యారు: కేతిరెడ్డి

image

వైసీపీ ప్రభుత్వంలో చేసిన డెవలప్‌మెంట్‌ను పబ్లిసిటీ చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి విఫలం అయ్యారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు చెప్పేది అబద్ధమే అయినా ప్రజలు నమ్మే విధంగా చెబుతారు. అలా 4 సార్లు అబద్ధాలు చెప్పి గెలిచారు. డెవలప్‌మెంట్‌పై జగన్ దృష్టి పెట్టలేదనేది ఆరోపణ. వెల్ఫేర్‌కు అయినంత పబ్లిసిటీ డెవలప్‌మెంట్‌కు కాలేదు.’ అని అన్నారు.

Similar News

News December 5, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12785.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11,762.00
*వెండి 10 గ్రాములు రేట్: రూ.1780.00

News December 5, 2025

ఆదోని జిల్లా డిమాండ్‌.. టీడీపీ నేతలపై సీఎం అసంతృప్తి

image

కర్నూలు జిల్లా నేతల తీరుపై CM చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండును ముందుగా తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఎన్నికల ముందు ఆదోని జిల్లా డిమాండ్‌ లేదని తిక్కారెడ్డి వివరించినట్లు సమాచారం. దీనిపై జిల్లా నేతలంతా చర్చించుకుని తన వద్దకు రావాలని సీఎం సూచించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

News December 5, 2025

గద్వాల్: పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన అవసరం

image

గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులకు పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులకు శుక్రవారం గద్వాలలోని ప్రభుత్వ అభ్యసన, బాలికల ఉన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న రెండో దశ శిక్షణను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.