News February 6, 2025

పరకాల: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. పరకాల మండలం పైడిపల్లికి చెందిన మొగిలి(60) ఈ నెల 1న తన భార్యతో కలిసి మిర్చి తోటకు బయలుదేరాడు. మార్గమధ్యలో బయటకు వెళ్తున్న అని తిరిగి రాలేదు. మొగిలి ఆచూకీ కోసం వెతుకుతుండగా పొలం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. అతడి భార్య తన భర్త అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News November 26, 2025

ఎన్నికలను ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. నామినేషన్లు మూడు విడతల్లో స్వీకరించనున్నట్లు తెలిపారు. ఎన్నికల హ్యాండ్‌బుక్‌పై పూర్తి అవగాహనతో తప్పులేని విధంగా పనులు చేయాలని సూచించారు. నగదు-మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘా పెట్టి చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేయాలని ఆదేశించారు.

News November 26, 2025

వరంగల్: ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి!

image

WGL జిల్లా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని శాఖలు సన్నద్ధమవాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. మూడు విడతల్లో జరిగే ఎన్నికల్లో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని టెలికాన్ఫరెన్స్‌లో సూచించారు. కోడ్ అమలు, హోర్డింగుల తొలగింపు, నిఘా బృందాల ఏర్పాటు, మద్యం-డబ్బు పంపకాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, లైటింగ్, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలన్నారు.

News November 26, 2025

బండవతపురంలో రిజర్వేషన్ గందరగోళం

image

WGL జిల్లా వర్ధన్నపేట మండలం బండవతపురం గ్రామంలో మొత్తం 1,550 ఓట్లు ఉండగా సర్పంచ్ స్థానం జనరల్‌కు కేటాయించారు. గ్రామంలో 10 వార్డుల్లో 5 జనరల్, 5 ఎస్సీ రిజర్వ్ చేశారు. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక్క వార్డూ బీసీ కేటగిరీకి రాకపోవడంతో గ్రామ రాజకీయాలు వేడెక్కాయి. బీసీ ఓటర్లు ఉన్నచోట ఎస్సీ, ఎస్సీ ఓటర్లు ఉన్నచోట జనరల్ వార్డులు రావడం గందరగోళానికి దారి తీసింది. దీంతో నువ్వా? నేనా? అన్నట్టుగా ఉంది.