News August 25, 2024
పరకాల వాసికి అమేజింగ్ ఇండియన్స్ అవార్డు

పరకాల మున్సిపాలిటీ రాజుపేటకు చెందిన మహిపాల్ చారి ఢిల్లీలో అమేజింగ్ ఇండియన్స్ అవార్డు-2024 స్వీకరించారు. తన కళా నైపుణ్యంతో మినీ కల్టివేటర్ను ఆవిష్కరించినందుకు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు పత్తి, మిర్చి పంటల సాగులో రైతులకు ఉపయోగపడే మినీ కల్టివేటర్, శ్రీవరి సాగు వీడర్, మినీ ట్రాక్టర్ను తయారు చేశారు. 2018లో నేషనల్ ఎంటర్ప్రెన్యుర్షిప్ అవార్డు సైతం అందుకున్నారు.
Similar News
News October 29, 2025
వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం

వరంగల్ జిల్లా మొత్తాన్ని వర్షాలు చుట్టుముట్టాయి. జిల్లాలో కేవలం ఒక్కరోజులో (ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు) 1245.4 మి.మీ. భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వర్ధన్నపేట (143.8 మి.మీ), నెక్కొండ (143.7 మి.మీ), పర్వతగిరి (130.5 మి.మీ), రాయపర్తి (115.3 మి.మీ) మండలాల్లో కురిసినట్లు రికార్డులు చెబుతున్నాయి.
News October 29, 2025
వరంగల్: భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలకు సెలవు

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రత దృష్ట్యా వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, సహాయనిధి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లా విద్యాధికారి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో హెడ్మాస్టర్లు విద్యార్థులు, తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందించాలనీ, విద్యార్థులు సురక్షితంగా ఇంటికి చేరేలా చూడాలని సూచించారు.
News October 29, 2025
వరంగల్: రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

తుఫాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. వర్షాల కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసర సహాయార్థం కలెక్టరేట్లో 1800 425 3424, జీడబ్ల్యూ ఎంసీలో 1800 425 1980 నంబర్లను ఏర్పాటు చేశారు. సమస్యలపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.


