News May 26, 2024
పరవాడలో యువకుడు ఆత్మహత్య

పెదముషిడివాడలో ఉంటున్న కోట్ల జగదీశ్ (23) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా మలిచర్లకి చెందిన జగదీశ్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ బాలసూర్యరావు తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అతని స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం లవ్ ఫెయిల్యూర్తోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చు అని తెలిపారు.
Similar News
News November 24, 2025
విశాఖ తీరంలో విషాదం.. మరో మృతదేహం లభ్యం

విశాఖ లైట్ హౌస్ బీచ్లో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల ఘటన విషాదాంతమైంది. ఆదివారం తేజేశ్ మృతదేహం లభ్యం కాగా, సోమవారం ఉదయం ఆదిత్య మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చిందని త్రీ టౌన్ సీఐ పైడయ్య తెలిపారు. సముద్ర స్నానానికి దిగి అలల ధాటికి వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News November 24, 2025
బిజీబిజీగా విశాఖ పోలీసుల షెడ్యూల్

విశాఖలో పోలీసు యంత్రాంగం బిజీ బిజీ షెడ్యూల్తో విధులు నిర్వహిస్తున్నారు. వారం క్రితం CII సమ్మెట్ సభలును విజయవంతంగా విధులు నిర్వహించిన పోలీసులకు వరుసగా మూడు కార్యక్రమాలు జరగనున్నడంతో సవాల్గా మారింది. కనకమాలక్ష్మి దేవస్థానం పండుగ ఉత్సవాలు. మేరీ మాత ఉత్సవాలు, ఇండియా-సౌత్ ఆఫ్రికా వన్డే క్రికెట్ మ్యాచ్కు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలుతో సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.
News November 24, 2025
విశాఖ: ప్రియరాలితో వాగ్వాదం.. ప్రియుడి ఆత్మహత్య

గాజువాక సమీపంలోని తుంగ్లం పక్కన చుక్కవానిపాలెంలో రాజేశ్ రెడ్డి (30) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతితో నిన్న రాత్రి వాగ్వాదం జరగడంతో మనస్థాపం చెందిన రాజేశ్ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి తల్లి, చెల్లి ఉన్నారు. వ్యాన్ డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


