News May 26, 2024
పరవాడలో యువకుడు ఆత్మహత్య

పెదముషిడివాడలో ఉంటున్న కోట్ల జగదీశ్ (23) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా మలిచర్లకి చెందిన జగదీశ్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ బాలసూర్యరావు తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అతని స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం లవ్ ఫెయిల్యూర్తోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చు అని తెలిపారు.
Similar News
News October 18, 2025
బీచ్లో లైట్లు ఏవి..? అధికారులపై మేయర్ ఆగ్రహం

విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు శనివారం రాత్రి ఆర్కే బీచ్ పరిసరాలను పరిశీలించారు. బీచ్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయనందుకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితమే ఆదేశించినా చర్యలు తీసుకోలేదని మేయర్ విమర్శించారు. బీచ్లో హైమాస్ట్ లైట్లు వెలగక సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే పరిశుభ్రతపై శ్రద్ధ వహించి, బీచ్ అందాన్ని కాపాడాలని సూచించారు.
News October 18, 2025
విశాఖ-పార్వతీపురం మధ్య స్పెషల్ ట్రైన్

దీపావళి రద్దీ దృష్య్టా ఈనెల 27 వరకు విశాఖ-పార్వతీపురం మధ్య మెము స్పెషల్ ట్రైన్ నడవనుంది. విశాఖలో ఉ.10కు బయలుదేరి పార్వతీపురం మ.12.20కు చేరుకుంటుంది. తిరిగి పార్వతీపురంలో మ.12.45కు బయలుదేరి బొబ్బిలి 1.10కు చేరుకుని విశాఖ సా.4గంటలకు వెళ్లనుంది. సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరంలో ఆగనుంది. > Share it
News October 18, 2025
ఆటోలు గుద్దుకున్నా ఛలో పోలీస్ స్టేషన్ అంటారేమో: విష్ణుకుమార్ రాజు

వైసీపీ స్థితిని చూస్తే బాధ కలుగుతోందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. రెండు ఆటోలు గుద్దుకున్నా ఛలో పోలీస్ స్టేషన్ అనే స్థాయికి దిగిపోయిందని ఎద్దేవా చేశారు. వైజాగ్ ఐటీ, ఐటీ అనుబంధ రంగాలకు బెస్ట్ డెస్టినేషన్ అవుతుందన్నారు. అదానీకి భూములు ధారాదత్తం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగా 2వేల ఉద్యోగాలు, పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతారని వెల్లడించారు.