News April 9, 2025

పరవాడ ఫార్మాసిటీలో యువకుడు మృతి

image

పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంలో బుచ్చయ్యపేట మండలం నీలకంఠాపురానికి చెందిన యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మంగళవారం ఓ కంపెనీకి సంబంధించిన వ్యర్థపదార్థాల డ్రమ్ములు క్లీన్ చేస్తుండగా కెమికల్ పడి పడాల హరినాథ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు విలపిస్తున్నారు.

Similar News

News November 23, 2025

త్వరలో జిల్లా అంతటా పర్యటిస్తా: జీవన్ రెడ్డి

image

త్వరలో నిజామాబాద్ జిల్లా అంతటా పర్యటించి,స్థానిక పోరుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తానని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆపద కాలంలో పార్టీ కోసం పోరాడుతున్న గులాబీ శ్రేణులకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను గ్రామగ్రామాన ఎండగడతామని అన్నారు.

News November 23, 2025

మహబూబాబాద్ బిడ్డకు గోల్డ్ మెడల్

image

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం జాటోత్ తండాకు చెందిన క్రీడాకారిణి గుగులోతు ప్రియ ఒడిశాలో జరిగిన ఈఎంఆర్‌ఎస్ 4వ జాతీయ టైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చి పోటీ పడిన క్రీడాకారులను ఎదుర్కొని స్వర్ణ పతకంతో రాష్ట్రానికి పేరు తెచ్చిన ప్రియను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆమెకు ప్రశంసా పత్రాన్ని అందజేసిన సీఎం.. భవిష్యత్తులో మరిన్ని పథకాలను సాధించాలని ప్రోత్సహించారు.

News November 23, 2025

సిద్దిపేట: 25న వాడిన సామాగ్రి వేలంపాట

image

వాడిన ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు, బ్యాటరీలు, టెంట్లు ఇతర సామాగ్రికి 25న జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ (పెద్ద కోడూరు శివారు)లో వేలంపాట వేస్తున్నట్టు సీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు వేలం పాట ప్రారంభమవుతుందని తెలిపారు. వేలం పాటలో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారు వేలంపాట ప్రదేశానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సందేహాలకు 87126 67416, 87126 67422 సంప్రదించాలన్నారు.