News February 2, 2025
పరశురాముడు ప్రతిష్ఠించిన చివరి శివలింగం!
నల్గొండ జిల్లాలో అతిపురాతనమైన శైవక్షేత్రం చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. క్షత్రియ సంహారానంతరం, తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠించగా అందులో ఇది చివరి శివలింగమని స్థలపురాణం. పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతిని పొంది శివసాయుజ్యాన్ని పొందాడట. పరశురాముని ఆత్మలింగము ఆలయం సమీపంలోని వేరొక గుహలో ఉంది.
Similar News
News February 2, 2025
పెద్దగట్టు జాతరకు నిధులు విడుదల
దూరజ్పల్లి లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు ప్రభుత్వం శనివారం నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు జాతర జరగనుంది. నేడు ఆలయం వద్ద దిష్టి పూజ నిర్వహించనున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఘనంగా జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివస్తారు. దీంతో పెద్దగట్టు పరిసరాలు కుంభమేళాను తలపిస్తాయి.
News February 2, 2025
నేటి నుంచే చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు
చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు భక్తులకు వసతులు, ఆలయానికి రంగులు, పారిశుద్ధ్యం, మంచినీటి వసతిలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఏర్పాట్ల పనులలో నిమగ్నమై ఉన్నారు. ఈసారి జాతరకు సుమారుగా 12 లక్షల వరకు భక్తులు రావచ్చని అంచనా వేశారు.
News February 1, 2025
నల్గొండ: రాజకీయ పార్టీల నేతలతో సమావేశం
నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ ఛాంబర్లో జిల్లాలోని రాజకీయ పార్టీ నేతలతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించనున్నారు. పోలింగ్ స్టేషన్ల ఖరారుకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలు పై రాజకీయ పార్టీల నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయాలని రాజకీయ నేతలకు అధికారులు తెలిపారు.