News February 2, 2025
పరశురాముడు ప్రతిష్ఠించిన చివరి శివలింగం!

నల్గొండ జిల్లాలో అతిపురాతనమైన శైవక్షేత్రం చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. క్షత్రియ సంహారానంతరం, తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠించగా అందులో ఇది చివరి శివలింగమని స్థలపురాణం. పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతిని పొంది శివసాయుజ్యాన్ని పొందాడట. పరశురాముని ఆత్మలింగము ఆలయం సమీపంలోని వేరొక గుహలో ఉంది.
Similar News
News November 22, 2025
నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలి: సీతక్క

మేడారం జాతర పనులను యజ్ఞంలో చేపట్టాలని మంత్రి సీతక్క అన్నారు. మేడారం ఐటిడిఏ గెస్ట్ హౌస్లో సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. సీతక్క మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తద్దన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అదనపు లేబర్, యంత్రాలు, నిపుణులను సమకూర్చుకొని నిర్ణీత సమయానికి పనులని పూర్తి చేయాలన్నారు.
News November 22, 2025
అప్పుగా తెచ్చిన ₹2.30L కోట్లు ఏమయ్యాయ్: KTR

TG: అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న CM క్షమాపణలు చెప్పాలని KTR డిమాండ్ చేశారు. నెలకు ₹2300 CR కూడా లేని వడ్డీని ₹7వేల కోట్లుగా అబద్ధాలు చెబుతున్నట్లు ‘కాగ్’ నివేదిక బట్టబయలు చేసిందని చెప్పారు. BRS పదేళ్లలో ₹2.8L కోట్ల రుణం తెస్తే కాంగ్రెస్ 23నెలల్లోనే ₹2.30L కోట్లు అప్పు చేసిందని దుయ్యబట్టారు. కొత్త ప్రాజెక్టులు నిర్మించలేదని, అప్పు తెచ్చిన రూ.లక్షల కోట్లు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
News November 22, 2025
నాగర్కర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్ బాధ్యతలు

నాగర్కర్నూల్ జిల్లా నూతన ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్ శనివారం ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు చట్టబద్ధంగా తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.


