News February 2, 2025

పరశురాముడు ప్రతిష్ఠించిన చివరి శివలింగం!

image

నల్గొండ జిల్లాలో అతిపురాతనమైన శైవక్షేత్రం చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. క్షత్రియ సంహారానంతరం, తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠించగా అందులో ఇది చివరి శివలింగమని స్థలపురాణం. పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతిని పొంది శివసాయుజ్యాన్ని పొందాడట. పరశురాముని ఆత్మలింగము ఆలయం సమీపంలోని వేరొక గుహలో ఉంది.

Similar News

News November 28, 2025

VKB: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

image

వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండల పరిధిలోని బండపల్లి గ్రామానికి చెందిన గుండెపల్లి రవి 2016లో గర్భవతిగా ఉన్న తన భార్య సుజాతకు గొడ్డలితో హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు పత్రాలు, సాక్షాలను కోర్టుకు సమర్పించారు. శుక్రవారం వాదోపవాదనలు విన్న జిల్లా జడ్జి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు.

News November 28, 2025

వికారాబాద్ జిల్లాలో రెండో రోజు 178 నామినేషన్లు

image

వికారాబాద్ జిల్లాలోని తాండూర్ డివిజన్‌లో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ 11వ తేదిన జరగనున్నాయి. ఈ సందర్భంగా రెండో రోజు శుక్రవారం 178 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని కలెక్టర్ వివరించారు.

News November 28, 2025

HYD: పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన

image

హైటెక్స్‌లో 3 రోజులపాటు జరిగిన పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు దేశ విదేశాల నుంచి యాభై వేల మందికి పైగా సందర్శకులు హాజరై విశేష స్పందన లభించిందని తెలిపారు. పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పౌల్ట్రీ రంగానికి అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. ముగింపు కార్యక్రమానికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. కోడిగుడ్ల ఉత్పత్తిలో 2 స్థానంలో ఉండడం సంతోషం అన్నారు.