News February 15, 2025
పరామర్శకు తోడుగా వెళ్లి అనంత లోకాలకు

గాజువాకలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో లక్ష్మణరావు అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. సీతమ్మధారలోని ఓ అపార్ట్మెంట్లో లక్ష్మణరావు వాచ్మెన్గా పనిచేస్తుండగా ధోబీగా రమణ పనిచేస్తున్నారు. రమణ బంధువులలో ఒకరు చనిపోతే పరామర్శ కోసం ఇద్దరూ స్కూటీపై అనకాపల్లి వెళ్లారు. తిరిగి వస్తుండగా పాత గాజువాక వద్ద లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో లక్ష్మణరావు మృతిచెందినట్లు CI కోటేశ్వరరావు తెలిపారు.
Similar News
News December 6, 2025
జగన్కు దేవుడంటే లెక్కలేదు: సీఎం చంద్రబాబు

AP: వైసీపీ పాలనలోనే నేరస్థులు తయారయ్యారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రౌడీ షీటర్లు, లేడీ డాన్ల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ జగన్కు దేవుడు, ఆలయాల పవిత్రత అంటే లెక్కలేదని మండిపడ్డారు. బాబాయ్ హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన ఆయన పరకామణి చోరీ కేసునూ సెటిల్ చేయాలని చూశారని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.
News December 6, 2025
అవినీతి నిర్మూలనకు మాతో కలిసి నడవండి: ఎస్పీ

అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వారోత్సవాల సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతిని నిర్మూలించడానికి ప్రజలు పోలీసులతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగినా, డిమాండ్ చేసినా వెంటనే ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ చెప్పారు.
-SHARE IT
News December 6, 2025
చరిత్ర సృష్టించిన డికాక్

మూడో వన్డేలో భారత్పై సెంచరీ చేసిన(83 బంతుల్లో 106) డికాక్ అరుదైన రికార్డు సృష్టించారు. ఒకే టీమ్పై అత్యధిక సెంచరీలు(7) చేసిన వికెట్ కీపర్గా నిలిచారు. ఆ తర్వాత గిల్క్రిస్ట్(6)vsSL, సంగక్కర(6)vsIND ఉన్నారు. అలాగే వన్డేల్లో అత్యధిక శతకాలు(23) బాదిన వికెట్ కీపర్గా సంగక్కర సరసన చేరారు. అలాగే భారత్పై హయ్యెస్ట్ సెంచరీలు(7) చేసిన ప్లేయర్గా జయసూర్యతో సమానంగా నిలిచారు.


