News February 17, 2025

పరిగి టీచర్‌కు యాక్సిడెంట్

image

మొయినాబాద్ మం.లోని కనకమామిడి చౌరస్తాలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన 2 కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పరిగిలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించే శ్రీను, అతడి భార్య, కుమారుడికి గాయాలయ్యాయి. మొయినాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

Similar News

News November 23, 2025

భూపాలపల్లి: రూ.50 కోట్ల ధాన్యం రికవరీలో నిర్లక్ష్యం!

image

జిల్లా సివిల్ సప్లై శాఖలో రూ. 50 కోట్ల విలువైన ధాన్యాన్ని నేటికీ రికవరీ చేయడంలో నిర్లక్ష్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. 2022-23 రబీ సీజన్‌లో జిల్లాలోని వివిధ రైస్ మిల్లర్ యజమానులు టెండర్ ద్వారా తీసుకున్న ఈ ధాన్యాన్ని, రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ సీఎంఆర్ ద్వారా ప్రభుత్వానికి బియ్యంగా అందించలేదు. ధాన్యం తీసుకున్నది వాస్తవమేనని సివిల్ సప్లై అధికారులు ధ్రువీకరించారు.

News November 23, 2025

రేపు ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

image

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేపు (సోమవారం) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కల్లూరు మండలం దారుక బంజారాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో మంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ తెలిపారు. అధికారులు సకాలంలో హాజరు కావాలన్నారు.

News November 23, 2025

డీసీసీ దక్కకపోవడంపై మోహన్ రెడ్డి అసంతృప్తి

image

నల్లగొండ జిల్లా డీసీసీ దక్కకపోవడంపై గుమ్మల మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని ఆశించానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తిడితేనే పదవులు వస్తాయన్నారు. నిబద్ధతతో జెండా మోసిన నాయకులకు పదవులు రావని వాపోయారు. పార్టీ ఏ కార్యక్రమాలకు పిలుపు నిచ్చిన నిబద్ధతతో పని చేశానన్నారు.