News February 17, 2025
పరిగి టీచర్కు యాక్సిడెంట్

మొయినాబాద్ మం.లోని కనకమామిడి చౌరస్తాలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన 2 కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పరిగిలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించే శ్రీను, అతడి భార్య, కుమారుడికి గాయాలయ్యాయి. మొయినాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
Similar News
News November 27, 2025
బయటకు సుందరం.. లోపల దుర్గంధం

వేములవాడ పట్టణంలోని VIP రోడ్డు ప్రాంతం బయటకు అందంగా కనిపిస్తుండగా.. వెనుక వైపు దుర్గంధం వెదజల్లుతోంది. పోలీస్ స్టేషన్- పార్వతీపురం దారిలో ఉన్న వీఐపీ రోడ్డులో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఇనుప రేకులతో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ కనపడకుండా దీనిని ఫిక్స్ చేశారు. మురికి కాలువ మళ్లించే పనులు అటకెక్కడంతో చెత్త పేరుకుపోయి, మురికి నీరు నిలిచి ఈ ప్రాంతంలో కంపు కొడుతోంది.
News November 27, 2025
VKB: అనుమానస్పద వ్యక్తులపై నిఘా: SP

స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ స్నేహ మెహ్రా పోలీసు సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, మొదటి విడతలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆమె పేర్కొన్నారు. అనుమానస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని సూచించారు.
News November 27, 2025
తిరుమల: కల్తీ నెయ్యి కేసులో మరో అరెస్ట్.!

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ అధికారులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. గతంలో టీటీడీ ప్రొక్యూర్ మెంట్ జీఎం సుబ్రహ్మణ్యాన్ని అరెస్టు చేశారు. తాజాగా అరెస్ట్ అయిన వ్యక్తికి తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయినవారి సంఖ్య 9కి చేరింది.


