News March 23, 2025

పరిగి: పది పరీక్ష రాస్తూ కళ్లు తిరిగి పడిన విద్యార్థి

image

దోమ మండలం ఊట్పల్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి రిషిక పరిగి మున్సిపల్‌లోని జిల్లా పరిషత్ నంబర్-టు పాఠశాలలో హిందీ పరీక్ష రాస్తోంది. ఈ క్రమంలో కళ్లు తిరిగి పడిపోయింది. గమనించిన ఉపాధ్యాయులు, సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి తిరిగి పరీక్ష రాయించారు.

Similar News

News December 8, 2025

రెండు గెలాక్సీలు ఢీకొట్టుకుంటే..

image

ఈ విశ్వం ఎన్నో వింతలకు నిలయం. లక్షల కాంతి సంవత్సరాల దూరంలో నిత్యం అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. గెలాక్సీలు ఢీకొట్టడం/గురుత్వాకర్షణ శక్తితో ఐక్యమవడం నిరంతర ప్రక్రియ. అలా 2 గెలాక్సీలు కలిసిపోతున్న IC 1623 దృశ్యాన్ని నాసా ‘చంద్రా అబ్జర్వేటరీ’ రిలీజ్ చేసింది. ఇవి విలీనమై కొత్త నక్షత్రాలు లేదా బ్లాక్‌హోల్ ఏర్పడుతుందని తెలిపింది. కాగా ఈ చిత్రం వండర్‌ఫుల్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

News December 8, 2025

‘పరీక్షా పే చర్చ’.. ఉమ్మడి జిల్లాకు కోఆర్డినేటర్లు నియామకం

image

‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు పశ్చిమ, ఏలూరు జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించినట్లు డైట్ ప్రిన్సిపాల్ ఎం.కమలకుమారి తెలిపారు. పశ్చిమ గోదావరికి ఎం.విజయప్రసన్న, బి.జాన్సన్‌లు, ఏలూరు జిల్లాకు వై.స్వరాజ్యశ్రీనివాస్, సీహెచ్ గోవిందరాజులు, శామ్యూల్‌ సంజీవ్‌లు ఎంపికయ్యారు. ఈనెల 11వ తేదీ వరకు జరిగే రిజిస్ట్రేషన్లను పర్యవేక్షించాలని ఆమె సూచించారు.

News December 8, 2025

FLASH: సూర్యాపేట: నకిలీ బంగారం ముఠా ARREST

image

తక్కువ ధరకు బంగారం ఆశ చూపి ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టును సూర్యాపేట పోలీసులు రట్టు చేశారు. హనుమకొండకు చెందిన వెంకటేశ్వర రావు నుంచి రూ.12 లక్షలు తీసుకుని నకిలీ బంగారం అంటగట్టినట్లు ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు. ఈ మోసంలో నలుగురు నిందితులు (నరేశ్, ఆదినారాయణ, యోగిరెడ్డి, నాగిరెడ్డి) అరెస్టు అయ్యారు. నకిలీ బంగారాల ప్రకటనలను నమ్మవద్దని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.