News March 23, 2025

పరిగి: పది పరీక్ష రాస్తూ కళ్లు తిరిగి పడిన విద్యార్థి

image

దోమ మండలం ఊట్పల్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి రిషిక పరిగి మున్సిపల్‌లోని జిల్లా పరిషత్ నంబర్-టు పాఠశాలలో హిందీ పరీక్ష రాస్తోంది. ఈ క్రమంలో కళ్లు తిరిగి పడిపోయింది. గమనించిన ఉపాధ్యాయులు, సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి తిరిగి పరీక్ష రాయించారు.

Similar News

News November 11, 2025

VKB: లగచర్ల ఘటనకు నేటికి ఏడాది

image

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన లగచర్ల ఘటన జరిగి నేటికి ఏడాది అవుతుంది. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్‌కు దుద్యాల మండలం లగచర్లతో పాటు మరో రెండు గ్రామాల్లో భూసేకరణ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. హాజరైన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి పాల్పడిన సంగతి విదితమే. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే సహా పలువురు గ్రామస్థులు అరెస్టు కావడంతో ఉద్రిక్తత కొనసాగింది.

News November 11, 2025

HNK: ఫిజియోథెరపీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

హనుమకొండ జిల్లా సమగ్ర శిక్ష విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపిస్టు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్, ఇన్‌చార్జ్ డీఈఓ వెంకటరెడ్డి తెలిపారు. పరకాల, శాయంపేట, ఆత్మకూరు, దామెర, వేలేరు, కమలాపూర్, భీమదేవరపల్లి, నడికూడ మండలాల్లో తాత్కాలిక నియామకాలు చేపడతారు. ఈ నెల 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

News November 11, 2025

కొమ్ములవంచలో కత్తిపోట్ల కలకలం

image

కొడుకును పొడుస్తున్నాడని అడ్డుకున్న తల్లిని కత్తితో పొడిచిన ఘటన MHBD జిల్లాలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నర్సింహులపేట(M) కొమ్ములవంచ గ్రామంలో బూరుగండ్ల రవికి పారునంది అర్జున్‌లకు మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ క్రమంలో రవిని కత్తితో అర్జున్‌ను పొడుస్తుండగా అడ్డుకోబోయిన అతడి తల్లి సునీతను చేయి దగ్గర పొడిచాడు. వారిని 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.