News December 19, 2024
పరిటాల రవి హత్య ఎలా జరిగిందంటే?
పరిటాల రవి హత్య కేసులో ఐదుగురికి <<14915888>>బెయిల్<<>> మాంజూరైన విషయం తెలిసిందే. కాగా అనంతపురంలో 2005 జనవరి 24న రవి హత్యకు గురయ్యారు. కార్యకర్తల సమావేశం కోసం జిల్లా టీడీపీ కార్యాలయానికి రాగా ఆయనపై మొద్దుశీను, నారాయణరెడ్డి కాల్పులు జరిపారు. కొందరు బయట బాంబులు వేశారు. కాల్పుల్లో ఆయన చనిపోయారు. ఈ కేసులో మొత్తం 16 మంది నిందితులుగా ఉన్నారు. ఏ-1మొద్దు శీను, ఏ-2 మద్దెలచెరువు సూరి కేసు విచారణ సమయంలోనే హత్యకు గురయ్యారు.
Similar News
News January 26, 2025
రిపబ్లిక్ వేడుకలకు అనంతపురం జిల్లా సర్వం సిద్ధం
జనవరి 26న పురస్కరించుకొని రిపబ్లిక్ వేడుకలకు అనంతపురం జిల్లా సర్వం సిద్ధమైంది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాన్ని జాతీయ పతాకం లోని కాషాయపు రంగు, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన విద్యుత్ దీపాలను అలంకరించారు. విద్యుత్ దీపాలు సుందరంగా అలంకరించడంతో కలెక్టర్ కార్యాలయం ఆకట్టుకుంటోంది. రేపు ఉదయం జాతీయ జెండా త్రివర్ణ పతాకాలు ఎగరనున్నాయి.
News January 25, 2025
అనంతపురం జిల్లా వాసికి ‘పద్మశ్రీ’
కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించగా ఏపీ నుంచి ఐదుగురికి వరించాయి. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లు గ్రామానికి చెందిన మాడగుల నాగఫణిశర్మ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆర్ట్ విభాగంలో నాగఫణిశర్మకు కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ప్రకటించింది.
News January 25, 2025
పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ
నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ‘పద్మభూషణ్’ పురస్కారం వరించడంపై అనంతపురం జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. 1960లో జన్మించిన బాలయ్య 14ఏళ్ల వయసులోనే తాతమ్మకల చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇప్పటి వరకు 109 సినిమాల్లో నటించారు. సినీరంగంలో రాణిస్తూ 2014లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన హ్యాట్రిక్ గెలుపు సాధించారు. బసవతారకం ఆసుపత్రితో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.