News March 19, 2025
పరిశ్రమల్లో ప్రమాదాలు తలెత్తకుండా భద్రతా ప్రమాణాలు పాటించండి: జేసీ

పరిశ్రమల్లో ఆకస్మిక ప్రమాదాలు సంభవించినప్పుడు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ పరిశ్రమల యాజమాన్యాలను సూచించారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలన్నారు.
Similar News
News March 20, 2025
ఈ నెల 29న సూర్య గ్రహణం

ఈ నెల 29వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుందని నాసా తెలిపింది. ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ భూమిపై నుంచి పాక్షికంగా కనిపిస్తుందని వెల్లడించింది. భారతీయులు ఈ గ్రహణాన్ని చూసే అవకాశం లేదని చెప్పింది. నార్త్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, నార్తర్న్ ఆసియా, సౌత్ అమెరికా, గ్రీన్ లాండ్, ఐలాండ్ దేశస్థులు గ్రహణాన్ని పాక్షికంగా చూడవచ్చని స్పష్టం చేసింది. కాగా, కొత్త ఏడాదిలో ఇది తొలి సూర్యగ్రహణం కావడం విశేషం.
News March 20, 2025
మదనపల్లె: భారీగా పడిపోయిన ధరలు.. KG రూ.11

మదనపల్లెలో కిలో టమాటాలు రూ.11 పలుకుతున్నాయి. వారం రోజులుగా ధరలు నిలకడగా ఉన్నాయి. టమాటా మార్కెట్లో మొదటి క్వాలిటి టమాటా కిలో రూ.11వరకు గురువారం పలికింది. పంట దిగుబడులు ఉన్నప్పటికీ రేట్లు పెరగలేదు. మార్కెట్కు ఆదివారం 108మెట్రిక్ టన్నుల టమాటాలను రైతులు మదనపల్లెకు తీసుకువచ్చారు. A గ్రేడ్ క్వాలిటీ రకం కిలో రూ.11, B గ్రేడ్ రకం రూ.10, C గ్రేడ్ రకం రూ.9 చొప్పున అమ్ముడుపోయాయని మార్కెట్ అధికారులు తెలిపారు.
News March 20, 2025
ఉమ్మడి కరీంనగర్: బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రంలోని బీసీ గురుకుల పాఠశాలల్లో 2025-2026 ఏడాదికి 6,7,8,9 తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. http://www.mjptbcadmissions.org లో ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి. సైదులు తెలిపారు. ఎప్రిల్ 24న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మొత్తం 6,832 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తామన్నారు.