News December 27, 2024
పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతి: కలెక్టర్

పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆమె అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా పరిశ్రమల సంస్థ జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అనుమతుల కోసం వచ్చిన 565 దరఖాస్తులలో 499 ఆమోదం పొందాయని చెప్పారు.
Similar News
News November 19, 2025
పెద్దారవీడు వద్ద ఎద్దుల అరకలను ఢీకొని దోర్నాల వ్యక్తి మృతి

పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న ఎద్దుల అరకలను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. వారిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు దోర్నాల మండలం యడవల్లికి చెందిన నల్లబోతుల శివగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 19, 2025
ఆన్లైన్ మోసాలపై తస్మాత్ జాగ్రత్త: ప్రకాశం SP

ఆన్లైన్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు సూచించారు. మంగళవారం ఒంగోలు SP కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయని అన్నారు. ఫ్రాడ్ కాల్ స్కామ్ల ద్వారా సైబర్ మోసగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి మోసాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని కోరారు.
News November 18, 2025
ఆన్లైన్ మోసాలపై తస్మాత్ జాగ్రత్త: ప్రకాశం SP

ఆన్లైన్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు సూచించారు. మంగళవారం ఒంగోలు SP కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయని అన్నారు. ఫ్రాడ్ కాల్ స్కామ్ల ద్వారా సైబర్ మోసగాళ్ళు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని చెప్పారు.


