News February 24, 2025

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

image

పది, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహనపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం బోర్డు పరీక్షల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Similar News

News September 18, 2025

HYD: 40% పెరిగిన వాహనాల సంఖ్య

image

6ఏళ్లలో HYD రోడ్లపై వాహనాల సంఖ్య 40% పెరిగింది. రోజుకు 1,500 నుంచి 2 వేల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. సిటీలోని మొత్తం వాహనాల్లో 63 లక్షల బైకులు, 16 లక్షల కార్లు రోడ్ల మీద తిరుగుతున్నాయి. కిలోమీటర్‌ రోడ్డుపై దాదాపు 8వేల టూవీలర్లు, 2 వేల కార్లు కనిపిస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

News September 18, 2025

లిక్కర్ స్కాం.. 20 చోట్ల ఈడీ తనిఖీలు

image

ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో బోగస్ పేమెంట్లకు సంబంధించి లావాదేవీలు చేసిన వారి సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 18, 2025

HYD: పార్కులు కాపాడిన హైడ్రా.. హెచ్చరిక బోర్డులు

image

హైడ్రా అధికారులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని పార్కు స్థలాలను ఆక్రమణల నుంచి రక్షించారు. కూకట్‌పల్లి మూసాపేట సర్కిల్‌లోని సనత్‌నగర్ కోఆపరేటివ్ సొసైటీ లే ఔట్‌లో 1600 గజాల భూమిని, రంగారెడ్డి జిల్లా మదీనాగూడలో పార్కు కోసం కేటాయించిన 600ల గజాల స్థలాన్ని కాపాడారు. ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.