News March 11, 2025

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం ASF పీటీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శుద్ధమైన తాగునీరు, విద్యుత్, వెలుతురు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.

Similar News

News November 22, 2025

UPDATE: MBNR: పీయూ.. పలు కోర్సుల ఫలితాలు

image

పాలమూరు వర్సిటీలోని పరిపాలన భవనములో బి.ఎడ్,ఎం ఫార్మసీ,బిపిఎడ్,ఎం ఫార్మసీ, LLB ఫలితాలను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ GN శ్రీనివాస్ విడుదల చేశారు.
✒బి.ఎడ్ 2వ సెమిస్టర్-71.98%
✒బి.ఎడ్ 4వ సెమిస్టర్- 93.48%
✒LLB 2వ సెమిస్టర్-68.85%
✒LLB 4వ సెమిస్టర్- 86.81%
✒బి.ఫార్మసీ 4వ సెమిస్టర్-60.40%
✒బీఫార్మసీ 6వ సెమిస్టర్-57.77%
✒ఎం.ఫార్మసీ 2వ సెమిస్టర్-72.22%
✒బిపిఎడ్ 2వ సెమిస్టర్-87.13%

News November 22, 2025

సూర్యాపేట: ‘ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌ను వేగవంతం చేయాలి’

image

5-15 సంవత్సరాల పాఠశాల విద్యార్థులందరికీ ఆధార్ మెండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ సీతారామ రావు ఆపరేటర్లకు సూచించారు. జిల్లాలో 24,532 మంది విద్యార్థులకు ఈ అప్‌డేట్ చేయాల్సి ఉందన్నారు. ఆధార్ సవరణలు (పేరు, పుట్టిన తేదీ) కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.

News November 22, 2025

మంచిర్యాల: పసిబిడ్డల ప్రాణాలకు లెక్కలేదా?

image

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొందరు డాక్టర్లు <<18353100>>బిడ్డల<<>> ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. నిర్లక్ష్యంతో వారి ప్రాణాలు తీసి డబ్బులతో పరిహారం చేసుకుంటున్నారు. శుక్రవారం డాక్టర్ల నిర్లక్ష్యానికి 5 ప్రాణాలు పోయాయి. అయినా వారిలో సీరియస్‌నెస్ లేదు. ఇన్ని ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టనట్లు వ్యవరిస్తున్నారని.. బిడ్డల ప్రాణాలు తీసి డబ్బులు బిచ్చంగా పడేసి తప్పించుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్