News March 11, 2025

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం ASF పీటీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శుద్ధమైన తాగునీరు, విద్యుత్, వెలుతురు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.

Similar News

News January 5, 2026

గ్రామాభివృద్ధికి కూటమి కృషి చేస్తుంది: జిల్లా గ్రంథాలయ ఛైర్మన్

image

గ్రామాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఉండి నియోజవర్గం జనసేన పార్టీ ఇన్‌ఛార్జి జుత్తుగ నాగరాజు అన్నారు. ఉండి మండలం మహాదేవపట్నంలో సీసీ రోడ్డుకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామ సర్పంచ్ వనమా సుబ్బలక్ష్మి శ్రీనివాస్, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు బద్రి, పాసర్ల శ్రీనివాస్, నాగేశ్వరావు, పండు, కూటమి నాయకులు ఉన్నారు.

News January 5, 2026

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కృత్తికా శుక్లా

image

పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అందిన ఫిర్యాదులకు త్వరితగతిన మోక్షం కలిగించాలని కలెక్టర్ కృత్తికా శుక్లా అధికారులను ఆదేశించారు. నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన అర్జీల స్వీకరణలో ఆమె పాల్గొన్నారు. DRO మురళి, RDO మధులతలతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల వినతులను స్వయంగా స్వీకరించారు. సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు అర్జీలను బదిలీ చేస్తూ, నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కారం చూపాలన్నారు.

News January 5, 2026

మహ్మద్ సిరాజ్ అన్‌లక్కీ: డివిలియర్స్

image

మహ్మద్ సిరాజ్ కెరీర్‌పై SA మాజీ క్రికెటర్ AB డివిలియర్స్ స్పందించారు. ‘సిరాజ్ తిరిగి ODI జట్టులోకి రాగలిగాడు. కానీ అతను అన్‌లక్కీ. T20 వరల్డ్ కప్‌కి ఎంపిక కాలేదు. సెలక్టర్స్ టీమ్ బ్యాలన్స్‌పైనే ఫోకస్ చేశారు. సీమర్స్‌పై ఆధారపడకుండా స్పిన్నర్లకు ప్రాధాన్యమిచ్చారు. బుమ్రా, అర్ష్‌దీప్ జట్టులో ఉన్నారు. బ్యాటింగ్ చేయగలడని హర్షిత్ రాణాకు కూడా అవకాశమిచ్చారు’ అని తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నారు.