News March 21, 2025
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: గద్వాల కలెక్టర్

నేటి నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షలు సజావుగా జరిగేటట్లు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా పారదర్శకంగా పరీక్షలను నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 7,717 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా చూడాలన్నారు. విద్యార్థులకు ఆర్టీసీ సదుపాయం ఉండాలన్నారు.
Similar News
News December 5, 2025
8ఏళ్లైనా పూర్తికాని WGL కమిషనరేట్ పనులు!

కమిషనరేట్ నూతన భవన నిర్మాణానికి 2017లో భూమిపూజ జరిగినా, ఎనిమిదేళ్లు కావస్తున్నా పనులు పూర్తి కాలేదు. దీంతో శాఖలకు చాంబర్లు, కార్యాలయాలు లేక ఇబ్బందులు అధికమవుతున్నాయి. పాత హెడ్ క్వార్టర్స్<<18473913>> భవనాల్లో తగిన స్థలం<<>> లేకపోవడంతో CP, DCPలు, అనేక విభాగాలు గదులు పంచుకొని పనిచేస్తున్న పరిస్థితి ఉంది. నిర్మాణం ఆలస్యం కారణంగా పోలీసులు రోజువారీ పనుల్లో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
News December 5, 2025
VJA: భవానీలకు 15 లక్షల వాటర్ బాటిల్స్.. 100 ప్రత్యేక బస్సులు.!

ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 11 నుంచి 15 వరకు జరిగే భవానీ మాల విరమణకు సుమారు 7 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం 15 లక్షల వాటర్ బాటిళ్లు, 325 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ బస్టాండ్ నుంచి RTC 100 అదనపు బస్సులను కేటాయించింది. ప్రస్తుతం ఆలయం వద్ద బారిగేట్ల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి.
News December 5, 2025
బెంజ్, రేంజ్ రోవర్ కాకుండా ఫార్చునర్.. అందుకేనా?

నిన్న మోదీ, పుతిన్ టయోటా ఫార్చునర్ కారులో ప్రయాణించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. రేంజ్ రోవర్, బెంజ్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ వారు ఫార్చునర్లోనే ప్రయాణించారు. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా 2022లో అమెరికాతో పాటు యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశాల కార్లు కాకుండా జపాన్కు చెందిన టయోటాను ఎంచుకుని మోదీ, పుతిన్ వారికి బలమైన సందేశం పంపినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.


