News March 21, 2025
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: గద్వాల కలెక్టర్

నేటి నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షలు సజావుగా జరిగేటట్లు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా పారదర్శకంగా పరీక్షలను నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 7,717 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా చూడాలన్నారు. విద్యార్థులకు ఆర్టీసీ సదుపాయం ఉండాలన్నారు.
Similar News
News November 28, 2025
ఖమ్మం: తీగల వంతెన పనులకు జూన్ వరకు గడువు

ఖమ్మం నగరానికి కొత్త అందాలను తెచ్చేందుకు రూ.180 కోట్ల వ్యయంతో మున్నేరు నదిపై నిర్మిస్తోన్న తీగల వంతెన నిర్మాణ పనులు 60 శాతం పూర్తయ్యాయి.వర్షాలు,వరదల కారణంగా పనులకు అంతరాయం కలగడంతో, పూర్తి గడువును వచ్చే మార్చి నుంచి జూన్ వరకు పొడిగించినట్లు ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు. వంతెన పూర్తయితే శిథిలావస్థలో ఉన్న కాల్వొడ్డు వంతెన,బైపాస్పై భారీగా ఉన్న ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయని అధికారులు భావిస్తున్నారు.
News November 28, 2025
స్లీప్వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర రసాయనాలు

AP: దోమల నివారణకు ఉపయోగించే స్లీప్వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర మేపర్ఫ్లూథ్రిన్ అనే పురుగుమందు ఉన్నట్లు తేలింది. ఇటీవల విజయవాడలోని ఓ షాపులో తనిఖీలు చేసి స్లీప్వెల్ అగరబత్తీల నమూనాలను అధికారులు సేకరించారు. వాటిని HYDలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్కు పంపగా ప్రాణాంతక కెమికల్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీనివల్ల శ్వాసకోశ, నాడీ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
News November 28, 2025
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)లో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి B.Tech/ BE, MSc, MCA ఉత్తీర్ణులై, 22- 45ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.64,820- రూ.1,20,940 వరకు చెల్లిస్తారు. ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


