News March 21, 2025
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: గద్వాల కలెక్టర్

నేటి నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షలు సజావుగా జరిగేటట్లు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా పారదర్శకంగా పరీక్షలను నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 7,717 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా చూడాలన్నారు. విద్యార్థులకు ఆర్టీసీ సదుపాయం ఉండాలన్నారు.
Similar News
News December 1, 2025
కలుపు మందుల పిచికారీ – ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఏ పంటకు సిఫార్సు చేసిన కలుపు మందులను ఆ పంటలో మాత్రమే సరైన మోతాదులో ఫ్లాట్ ప్యాన్ లేదా ఫ్లడ్ జెట్ నాజిల్ను ఉపయోగించి పిచికారీ చేయాలి. కలుపు మందులను ఇతర రసాయనాలతో (కీటక/శిలింద్రనాశినులు/పోషకాలు) కలిపి ఉపయోగిస్తే కలుపు మందుల సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. పంట మొలకెత్తాక ఉపయోగించే కలుపు మందులను.. కలుపు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారి చేసి సమర్థవంతంగా అరికట్టవచ్చు.
News December 1, 2025
నేడు అతిభారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: ‘దిత్వా’ ప్రభావంతో ఇవాళ NLR, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. కోనసీమ, ప.గో., కృష్ణా, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, KDP, అన్నమయ్య, CTR జిల్లాల్లో భారీ వర్షాలు.. కాకినాడ, తూ.గో., ఏలూరు, NTR తదితర జిల్లాల్లోనూ మోస్తరు వానలకు అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ తిరుపతి, KDP, NLR, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులిచ్చారు.
News December 1, 2025
గర్భిణుల్లో వికారానికి కారణమిదే..

ప్రెగ్నెన్సీలో వికారం కామన్. అయితే ఇది గర్భంలోని శిశువును రక్షించే ప్రక్రియలో భాగమని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు చేసిన పరిశోధనలో తేలింది. కొత్తగా వచ్చిన శిశువుని శరీరం అంగీకరించి, హానికర పదార్థాల నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తుంది. శిశువు DNAలో సగం తండ్రిది కావడంతో పిండాన్ని తల్లి శరీరం ఫారెన్ బాడీగా భావిస్తుంది. కొత్తగా శరీరంలో ప్రవేశించిన దేనిమీదైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది.


