News February 25, 2025
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: KMR కలెక్టర్

ఇంటర్మీడియట్, పదవతరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా నిర్వహించాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్లో సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకునేందుకు బస్సులను ఆయా రూట్లలో నడపాలని సూచించారు.
Similar News
News December 16, 2025
ఇప్పటివరకు IPL వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు

*రూ.27 కోట్లు- రిషభ్ పంత్ (లక్నో)
*రూ.26.75 కోట్లు- శ్రేయస్ అయ్యర్ (పంజాబ్)
*రూ.25.20 కోట్లు- గ్రీన్ (కేకేఆర్)
*రూ.24.75 కోట్లు- స్టార్క్ (కేకేఆర్)
*రూ.23.75 కోట్లు- వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్)
*రూ.20.50 కోట్లు- కమిన్స్ (SRH) *రూ.18.50 కోట్లు- సామ్ కరన్ (పంజాబ్) *రూ.18 కోట్లు- పతిరణ (కేకేఆర్), అర్ష్దీప్ సింగ్ (పంజాబ్), చాహల్ (పంజాబ్)
News December 16, 2025
42% రిజర్వేషన్ల సాధనకు పోరాడుతూనే ఉంటాం: సీతక్క

TG: బీసీ కులగణన ప్రకారం 42% రిజర్వేషన్ల సాధన టార్గెట్గా కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రంలో 2 విడతల్లో 8,566 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయన్నారు. గ్రామస్థాయిలో కూడా కాంగ్రెస్ సత్తా చాటిందని చెప్పారు. సమ్మక్క-సారలమ్మ జాతర, ఆదివాసీ సంస్కృతి, ఆత్మగౌరవంపై తప్పుడు కామెంట్లు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేసే ప్రయత్నాలను కాంగ్రెస్ సహించబోదని హెచ్చరించారు.
News December 16, 2025
సర్పంచ్, వార్డు సభ్యులకు 20న ప్రమాణ స్వీకారం: జనగామ కలెక్టర్

జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలుపొందిన సర్పంచ్లు, వార్డు సభ్యులకు ఈ నెల 20వ తేదీన పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ వెల్లడించారు.


