News March 15, 2025
పరీక్షలు ప్రశాంతంగా రాయండి: KMR కలెక్టర్

ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలని ఎవరు ఒత్తిడికి లోను కావద్దని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. శనివారం ఆయన పిట్లంలో పర్యటించారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం ZPHSలో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అక్కడే వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
Similar News
News November 13, 2025
జగిత్యాల: పుట్టినరోజు నాడే యువకుడి సూసైడ్

జగిత్యాలకు చెందిన అనుమండ్ల కళ్యాణ్(26) పుట్టినరోజు నాడే ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. 10 నెలల క్రితం ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన ఇతడు మంగళవారం జన్మదినం సందర్భంగా రోజంతా తమతో ఫోన్ మాట్లాడాడని.. అంతలోనే అర్ధరాత్రి రూంలో ఉరివేసుకున్నాడని తోటి స్నేహితులు తమకు సమాచారం అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, తమ కళ్యాణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
News November 13, 2025
రూ.30 కోట్లతో మినీ వేలంలోకి CSK?

IPL-2026 మినీ వేలానికి ముందు CSK రిటెన్షన్స్పై మరికొన్ని అప్డేట్స్ బయటికొచ్చాయి. రచిన్ రవీంద్ర, కాన్వేతో పాటు చాలా మంది స్వదేశీ ప్లేయర్లను రిలీజ్ చేయాలని ఆ టీమ్ నిర్ణయించుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఫారిన్ ప్లేయర్లు మతీశా పతిరణ, నాథన్ ఎల్లిస్ను రిటైన్ చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. దాదాపు రూ.30 కోట్ల పర్స్తో CSK వేలంలో పాల్గొననున్నట్లు సమాచారం.
News November 13, 2025
రాష్ట్ర స్థాయి పోటీల్లో ఛాంపియన్గా కరీంనగర్

తెలంగాణ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా కరీంనగర్ జిల్లా క్రీడాకారులు నిలిచారు. ఈ సందర్భంగా వీరిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేకంగా అభినందించారు. వీరంతా జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆమె ఆకాంక్షించారు.


