News March 15, 2025
పరీక్షలు ప్రశాంతంగా రాయండి: KMR కలెక్టర్

ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలని ఎవరు ఒత్తిడికి లోను కావద్దని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. శనివారం ఆయన పిట్లంలో పర్యటించారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం ZPHSలో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అక్కడే వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
Similar News
News March 16, 2025
పద్మ అవార్డుల దరఖాస్తులకు ఆహ్వానం

జనవరి 26 గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు జులై 31లోగా http://awards.gov.in వెబ్సైట్లో నామినేషన్లు అప్లోడ్ చేయాలని వెల్లడించింది. అదే విధంగా రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్లో నామినేషన్లు/ సిఫార్సులను పంపించవచ్చని తెలిపింది. 2026 సంవత్సరానికి సంబంధించి అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
News March 16, 2025
మస్క్ కుమారునికి సహాయం చేసిన ట్రంప్

మస్క్ కుమారుడిని ట్రంప్ హెలికాప్టర్ ఎక్కిస్తున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. అమెరికా అధ్యక్షుడు ఫ్లోరిడాలోని తన ఇంటికి బయలుదేరగా ఆయనతో పాటు మస్క్ కుమారుడు వెళ్లాడు. ఆ ఛాపర్లోనికి ఎక్కడానికి పిల్లాడు ఇబ్బంది పడగా ట్రంప్ అతనికి సహాయం చేశారు. ఈ చిత్రాన్ని మస్క్ రీపోస్టు చేశారు. గత కొద్దిరోజులుగా టెస్లా అధినేత తన కుమారున్ని USA అధికార కార్యక్రమాలకు వెంట తీసుకెళుతున్న సంగతి తెలిసిందే.
News March 16, 2025
కృష్ణ: నేడు మంత్రి రాక.. భారీ బందోబస్తు సిద్ధం

మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ముడుమాల్ గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నిలువురాళ్ళను సందర్శించడానికి ఆదివారం కృష్ణ మండలం ముడుమాల్ గ్రామానికి రానున్నట్లు మక్తల్ సీఐ రామ్ లాల్ తెలిపారు. శనివారం కృష్ణ మండలం పరిధిలోని ముడుమల్ నిలువురాళ్లు సీఐ సందర్శించి మంత్రి రాకకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.