News March 15, 2025

పరీక్షలు ప్రశాంతంగా రాయండి: KMR కలెక్టర్

image

ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలని ఎవరు ఒత్తిడికి లోను కావద్దని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. శనివారం ఆయన పిట్లంలో పర్యటించారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం ZPHSలో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అక్కడే వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

Similar News

News March 16, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి

News March 16, 2025

మంచిర్యాల: తండ్రిపై దాడికి సుపారి ఇచ్చిన కొడుకు

image

తండ్రిపై దాడి చేయించేందుకు సుఫారి ఇచ్చిన కొడుకుతో పాటు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ CI అశోక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా వేంపల్లికి చెందిన సత్యానందం, కొడుకు రమేశ్‌కు కుటుంబ కలహాలు ఉన్నాయి. దీంతో పలువురికి రూ.50వేలు ఇచ్చి హోలీ రోజు తండ్రిపై దాడి చేయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి 24గంటల్లోగా నిందితులను అరెస్టు చేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు CI వెల్లడించారు.

News March 16, 2025

ASF: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఆసిఫాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలల్లో 6వ, 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ శ్వేత తెలిపారు. విద్యార్థులు మార్చి 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 15 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మరింత సమాచారం కోసం https://mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

error: Content is protected !!