News March 21, 2025

పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ప్రతీక్ జైన్

image

జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వికారాబాద్ కేంద్రంలోని పలు పాఠశాలలను సందర్శించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు.

Similar News

News April 19, 2025

మరోసారి థియేటర్లలోకి ‘బాషా’

image

రజినీకాంత్ ఎవర్ గ్రీన్ చిత్రాల్లో ఒకటైనా ‘బాషా’ మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. ఈ నెల 25న రీరిలీజ్ చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో రజిని స్వాగ్, స్టైల్‌ను థియేటర్లలో చూసేందుకు సిద్ధమంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడొస్తున్న చాలా చిత్రాలకు ‘బాషా’ స్క్రీన్ ప్లేను రిఫరెన్స్‌గా వాడతారని సినీ విశ్లేషకులు చెబుతారు.

News April 19, 2025

హెరాల్డ్ కేసులో మేం భయపడేది లేదు: ఖర్గే

image

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీపై పెట్టిన కేసులకు తాము భయపడేది లేదని AICC చీఫ్ ఖర్గే పేర్కొన్నారు. ప్రతీకారం తీర్చుకునేందుకే వారిని ఈ కేసులో ఇరికించారని ఆయన వ్యాఖ్యానించారు. వక్ఫ్ సవరణ చట్టం విషయంలో సుప్రీం కోర్టు తమ పార్టీ లేవనెత్తిన కీలక పాయింట్లకు ప్రాముఖ్యతనిచ్చిందని అన్నారు. బీజేపీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని, ప్రజలకు కాంగ్రెస్ నేతలు వాస్తవాలు చెప్పాలని ఖర్గే పిలుపునిచ్చారు.

News April 19, 2025

పెనుకొండలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చసుకొంది. ప్రమాదంలో కారు, బైకు ఢీకొనడంతో ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు వారు వివరించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!