News March 21, 2025
పరీక్షా కేంద్రాలను సందర్శించిన DEO

జిల్లాలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సెయింట్ ఆర్నాల్డ్, ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాలలను సందర్శించారు. అనంతరం విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును పరీక్ష కేంద్రాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
Similar News
News December 4, 2025
గోదావరిఖని డిపో DEC టూర్ ప్యాకేజీలు

GDK డిపో DECలో 2 ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. DEC 6న బయలుదేరే కర్ణాటక యాత్రలో హంపి-గోకర్ణ-మురుడేశ్వర-ఉడిపి-శృంగేరి-ధర్మస్థల-కుక్కి సుబ్రమణ్య-మంత్రాలయం దర్శనాలు ఉంటాయి. ఛార్జీలు: పెద్దలు రూ.6600, పిల్లలు రూ.5000. DEC 15న అరుణాచలం- రామేశ్వరం యాత్ర ఉంటుంది. ఇందులో కాణిపాకం- అరుణాచలం- శ్రీరంగం- పలని- మధురై- రామేశ్వరం సహా 10 ముఖ్యక్షేత్రాలు ఉంటాయి. ఛార్జీలు: పెద్దలు రూ.8000, పిల్లలు రూ.6000.
News December 4, 2025
చెల్పూర్, గొర్లవీడు సర్పంచుల బరిలో తాజా మాజీ ఎంపీపీలు..!

జయశంకర్ జిల్లాలో తాజా మాజీ ఎంపీపీలు ఇరువురు సర్పంచ్ బరిలో నిలిచారు. గణపురం మండల తాజా మాజీ ఎంపీపీ కావటి రజిత చెల్పూరు సర్పంచ్, భూపాలపల్లి తాజా మాజీ ఎంపీపీ మందల లావణ్య రెడ్డి గొర్లవీడు సర్పంచ్ బరిలో నిలిచారు. వీరిరువురు మండల స్థాయిలో ఎంపీపీలుగా పనిచేసి జనరల్ మహిళల రిజర్వేషన్ల రావడంతో వారి సొంత గ్రామాల్లో పోటీకి నిలిచారు. అందులో రజిత అధికార కాంగ్రెస్, లావణ్య ప్రతిపక్ష బీఆర్ఎస్లో ఉన్నారు.
News December 4, 2025
ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటాం: పవన్

AP: కాకినాడ(D) ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటామని వారితో సమావేశం సందర్భంగా Dy.CM పవన్ అన్నారు. ‘సముద్ర జలాల కాలుష్య సమస్యపై శాస్త్రీయ పరిశోధన చేస్తాం. జాలర్ల ఆదాయం పెంపు, మత్స్య సంపద వృద్ధి, తీర ప్రాంత రక్షణ, యువత, మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రజాధనం వృథా అయింది. చేసిన పనులే చేయాల్సిన దుస్థితిని అప్పటి పాలకులు తెచ్చారు’ అని ఆరోపించారు.


